
2024 పారిస్ ఒలింపిక్స్లో పురుషుల 57 కిలోల బరువు విభాగంలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అమన్ సెహ్రావత్ కేవలం 21 సంవత్సరాల 24 రోజుల వయస్సులో ఒలింపిక్స్లో వ్యక్తిగత పతకాన్ని గెలుచుకున్న భారతదేశపు అతి పిన్న వయస్కుడైన అథ్లెట్గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు పీవీ సింధు పేరిట ఉండేది.

కాంస్య పతక పోరులో, అమన్ తన తొలి ఒలింపిక్స్లో ప్యూర్టో రికో రెజ్లర్ను 13-5తో ఏకపక్షంగా ఓడించి పతకాన్ని గెలుచుకున్నాడు. అయితే, అమన్కు ఈ పతకం రావడం వెనుక కథనం చాలా ఉత్కంఠ రేపుతోంది.

నిజానికి కాంస్య పతకానికి ముందు అమన్ సెహ్రావత్ బరువు కూడా వినేష్ ఫోగట్ లాగానే చాలా ఎక్కువగా ఉంది. 57 కేజీల వెయిట్ కేటగిరీలో పోటీపడిన అమన్ సెమీ ఫైనల్లో ఓడిపోయినప్పుడు 4.5 కేజీల అధిక బరువుతో ఉన్నాడు. అంటే అతను సరిగ్గా 61.5 కిలోల బరువుతో ఉన్నాడు.

దీంతో అమన్కు కాంస్య పతకం దక్కడం అనుమానంగా మారింది. అయితే, కేవలం 10 గంటల్లోనే అమన్ 4.5 కిలోల బరువు తగ్గాడు. జగ్మందర్ సింగ్, వీరేంద్ర దహియా శిక్షణ పొందిన ఆరుగురు సభ్యుల రెజ్లింగ్ జట్టు అమన్ బరువును 57 కిలోలకు తగ్గించగలిగింది.

ఐతే కేవలం 10 గంటల్లోనే అమన్ 4.5 కిలోల బరువు ఎలా తగ్గాడోనని అంతా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ముందుగా అమన్ సెహ్రావత్కు గంటన్నర మ్యాట్ సెషన్ ఇచ్చారు. ఇందులో నిలబడి కుస్తీ పట్టాలని సూచించారు.

ఆ తర్వాత అమన్ సెహ్రావత్కు గంటపాటు వేడినీటి స్నానం చేశాడు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత, వ్యాయామశాలలో ఒక గంట ట్రెడ్మిల్పై కసరత్తులు చేశారు. ఆ తర్వాత 30 నిమిషాల పాటు విశ్రాంతి ఇస్తారు. ఆ తర్వాత, అమన్కు మసాజ్, లైట్ జాగింగ్, అతని బరువు తగ్గించడానికి 15 నిమిషాల రన్నింగ్ సెషన్ ఇచ్చారు.

అంతటితో ఆగకుండా ఒక్కరాత్రిలో పోరాడిన అమన్ బరువు తెల్లవారుజామున 4.30 నాటికి 56.9 కిలోలుగా మారింది. అంటే నిర్దేశించిన పరిమితి కంటే 100 గ్రాములు తక్కువగా చేసుకున్నాడు. అమన్ సెహ్రావత్ 10 గంటల్లో 4.5 కిలోల బరువు తగ్గాడు. ఎందుకంటే, భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ అధిక బరువు కారణంగా అనర్హుడని మనందరికీ తెలుసు.

వినేష్ 50 కిలోల ఈవెంట్లో ఫైనల్కు చేరి కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. కానీ, ఫైనల్స్కు ముందు, అతను నిర్దేశించిన పరిమితి కంటే 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో అతను పోటీ నుంచి అనర్హుడయ్యాడు. ప్రస్తుతం వినేష్ కేసు సీఏఎస్లో నడుస్తుండగా త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.