
టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి సింగ్ ధోని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. భర్తతో పాటు, కూతురు జీవా చేసే అల్లరి, బ్యూటిఫుల్ మూమెంట్స్ను వీడియో, ఫోటో తీసి అభిమానుల కోసం పోస్ట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ధోని అభిమానులకు బాగా దగ్గరయ్యారు.

టీమిండియా కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు సారథి విరాట్ కోహ్లీని అతడి భార్య అనుష్క శర్మ సోషల్ మీడియాలో సందడిగా ఉంటారు. విరాట్ ఎక్కడ మ్యాచ్ ఆడినా.. అక్కడ తప్పకుండా తన అనుష్క శర్మ స్టేడియంలో సందడి చేస్తుంది. ఇప్పుడు ఇద్దరు కాస్తా ముగ్గురుగా మారిన తర్వాత వచ్చిన ఐపీఎల్ 2021 కావడం ఎప్పుడు వస్తుందా రాదా అనేది పెద్ద సస్పెన్స్.. అయితే ఈ ఏడాది కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉండటంతో రాకపోయవచ్చని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అంటున్నారు.

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై జట్టు మరోసారి టైటిల్ హాట్ ఫేవరెట్గా రంగంలోకి దిగుతోంది. ఈ జంట కూడా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. ఈ మధ్యే రోహిత్ శర్మ కూతురు సమైరా హెల్మెట్ పెట్టుకుని సందడి చేసిన వీడియోను ఫ్యాన్స్ తెగ వైరల్ చేశారు.

సంజూ సామ్సన్ - చారులతా రీమేష్....ఈ ఇద్దరు మొదటిసారి తిరువనంతపురంలోని మార్ ఇవానియోస్ కాలేజీలో కలుసుకున్నారు, అక్కడ ఆమె బి.ఎస్.సి. కెమిస్ట్రీ..అదే కాలేజ్లో సంజూ బి.ఎ. చదువుకున్నారు. సంజూ ఆమెకు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు.. ఆశ్చర్యకరంగా ఆమె దానిని అంగీకరించింది.. ఆ అలా వారిద్దరి మధ్య కెమిస్ర్టీ కుదిరింది. కళాశాల సమయంలో వీరి ప్రేమ వికసించింది. అలా వారి బంధం 5 సంవత్సరాల తరువాత వివాహంగా మారింది.

ఐపీఎల్ 2021 సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. సోషల్ మీడియాలో తెలుగువారికి చాలా దగ్గరైన విదేశీ ఆటగాడు. ఇక్కడి నేటివిటి పూర్తిగా ఆకలింపు చేసుకున్న క్రికెటర్.. ఇంతలా సౌత్ ఇండియా ప్రజలకు క్లాజ్ అయిన ఎస్ఆర్హెచ్ సారథి వార్నర్.. ఎప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేస్తుంటాడు. కొన్ని తెలుగు పాటలను తన భార్యతో కలిసి స్టెప్పులు కూడా వేసిన సంగతి తెలిసిందే...

కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఏ దేశంలో పర్యటించినా తన భార్యను వెంట తీసుకెళ్తుంటాడు. గత ఏడాది జరిగిన ఐపీఎల్ 2020లో మోర్గాన్ అబుదాబి వీధుల్లో భార్యతో కలిసి చక్కర్లు కొట్టాడు. ప్రఖ్యాత షేక్ జాయెద్ మసీదను సందర్శించారు. మోర్గాన్ దంపతులిద్దరు అరబ్ సంప్రదాయ దుస్తులను ధరించి మసీదులోకి వెళ్లారు.