
చాలా మంది సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చడం చేస్తుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంట, చీకటి పడిన తర్వాత ఇల్లు ఊడ్చడం, చెత్తను బయట వేయడం వలన ఇది ఇంటిలో ఆర్థిక సమస్యలకు కారణం అవుతుందంట. అంతే కాకుండా లక్ష్మీదేవి వెల్లిపోతుందంట.

అదే విధంగా కొంత మంది రాత్రి సమయంలో గోర్లు తియ్యడం చేస్తుంటారు. అయితే ఇది కూడా మంచిది కాదంట, రాత్రి సమయంలో గోర్లు తియ్యడం వలన దరిద్రం చుట్టుకుంటుంది, ఇంటిలో కలహాలు మొదలు అవుతాయి, మనశ్శాంతి లోపిస్తుంది అని చెప్పుకొస్తుంటారు మన పెద్దవారు.

కొందరు రాత్రి సమయంలో బట్టలు ఉతుకుతుంటారు. కానీ రాత్రి పూట బట్టలు ఉతకడం కూడా అస్సలే మంచిది కాదంట. ముఖ్యంగా ఉతికిన బట్టలను బయట ఆరేయ్యడం వలన బట్టలపై ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందంట, ఇది అనారోగ్య సమస్యలు, ఒత్తిడి వంటి అనేక ఇబ్బందులకు కారణం అవుతుందంట.

అలాగే పాలు, పెరుగు దానం చేయడం కూడా మంచిది కాదంట, ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత పెరుగు లేదా పాలు దానం చేయడం వలన ఇది మీలో గ్రహ దోషాలకు కారణం అవ్వడం లేదా ఇంటిలో అనేక సమస్యలకు కారణం అవుతుందంట. అప్పుల బాధలు కూడా పెరుగుతాయంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు