
శని గ్రహం, కుజ గ్రహం చాలా దగ్గరగా వచ్చినప్పుడు అర్ధ కేంద్ర రాజయోగం ఏర్పడుతుంది. అయితే, కుజుడు ప్రస్తుతం మకర రాశిలో సంచరిస్తున్నాడు, అలాగే శని గ్రహం మీన రాశిలో సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాలు 45-డిగ్రీల అర్ధ కోణీయ సంయోగం ఏర్పరచనున్నాయి. దీంతో అర్ధ కేంద్ర యోగం ఏర్పడుతుంది. ఇది ఏ రాశుల వారికి కలిసి వస్తుందో చూద్దాం.

కుంభ రాశి : కుంభ రాశిలో జన్మించిన వారికి అర్ధ కేంద్ర రాజయోగం ఊహించని ప్రయోజనాలను అందించనుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గడంతో చాలా ఆనందంగా ఉంటారు. కెరీర్ పరంగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

మకర రాశి : మకర రాశి వారు అర్ధ కేంద్ర యోగం వలన తమ జీవితంలో ఊహించని ప్రయోజనాలు అందుకోనున్నారు. సంపద పెరుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రతి పనిలో విజయం వరిస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు పొందే ఛాన్స్ ఉంది.

వృషభ రాశి : వృషభ రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. ఆదాయంలో భారీ పెరుగుదల ఉంటుంది. అప్పుల బాధ నుంచి బయటపడతారు. వ్యక్తిగత జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది.