
పుట్టిన పిల్లలకు నల్లగాజులు వేయడం వల్ల దోషాలు, దిష్టి తగలకుండా రక్షణగా ఉంటాయి. అంతేకాదు.. పిల్లలకు గాజుల శబ్ధం ఆనందంతో.. సంతోషాన్ని కలిగిస్తాయి. ఆడపిల్లలు లక్ష్మీదేవి స్వరూపులు. ఆడపిల్లలకు గాజులు అలవాటు చేస్తారు. గాజులను పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చక్కదిద్దుకుంటారని నమ్మకం.

అమ్మవారి పూజల్లో పసుపు, కుంకుమలతోపాటు గాజులతో పూజిస్తారు. కాబట్టి.. మట్టిగాజులు వేసుకోవడం.. ముత్తైదుతనాన్ని సూచిస్తుంది.

రాజస్థాన్ వివాహిత స్త్రీలు భర్త వున్నంత కాలం మణికట్టు నుంచి, ముంచెయ్యివరకు ఏనుగు దంతముతో చేసిన గాజులు ధరించేవారు. అలాధరించడం వలన తన కుటుంబానికి, భర్తకు, సంతానానికి శుభం కలుగుతుందని నమ్మకము, విశ్వాసం.

పశ్చిమ బెంగాల్లో చిన్న గవ్వలు లేదా ఎర్ర పగడాలతో చేసిన గాజులను చేతులకు వేసుకొనడం పెళ్లయిన ఆడవారికి ఆచారంగా ఉంది

నేటికి ఆదివాసి, గిరిజన స్త్రీలు చేతులకు నిండుగా, ముంజేతి వరకు తెల్లటి, వెడల్పాటి చెక్కతో లేదా వెదురుతో చేసిన గాజులు ధరిస్తున్నారు.

సిక్కులు తమ మతాచారంలో లోహంతో చేసిన గాజును ధరిస్తారు. దానిని 'కడ' అంటారు.

పంజాబులో వధువులు పెళ్ళికి 21 రోజుల ముందు నుండి కాని, లేదా పెళ్ళి తరువాత సంవత్సరం వరకు ఏనుగు దంతంతో చేసిన గాజులని ధరించడం సంప్రదాయం.

ఉత్తర ప్రదేశ్లో పెళ్ళికూతురు ఎర్రచీర, ఎర్రగాజులు ధరించడం శుభదాయకంగా భావిస్తారు.

మహారాష్ర్ట, కర్నాటక, ఆంధ్రలో పెళ్ళికూతురు పచ్చగాజులు ధరించడం ఆనవాయితీ. పచ్చరంగు శుభానికి పతీకగా భావిస్తారు.