
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం సహజం. కొన్ని గ్రహాలు ప్రతి నెల రాశి సంచారం చేస్తుంటాయి. మరికొన్ని గ్రహాలు ఆరు నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి సంచారం చేస్తుంటాయి. అయితే అతి త్వరలో శక్తి వంతమైన సూర్యుడు వృషభ రాశిలోకి సంచారం చేయనున్నాడు. మే 15న మేష రాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. కాగా, దీని వలన ఏ రాశుల వారికి లక్కు కలిసి వస్తుందో ఇప్పుడు చూసేద్దాం.

మేష రాశి : మేష రాశి వారికి సూర్య సంచారం వలన వీరికి అద్భుతంగా ఉండనుంది. ముఖ్యంగా మే 15 నుంచి వీరు అనుకున్న పనులన్నీ సమయానుగుణంగా పూర్తి చేసుకుంటారు. సమాజంలో వీరికంటూ ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అత్యధిక లాభాలు అందుకునే రాశులు ఇవే. అలాగే వీరికి ఇది చాలా శుభ సమయం అని చెప్పాలి. ఈ సమయంలో చేసే ఏ పనులు అయినా సరే చాలా త్వరగా పూర్తి అవుతాయి.

వృషభ రాశి : వృషభ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే పనులను పెండింగ్ వేస్తూ వస్తున్నారో, వారి పనులు చాలా త్వరగా కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా వీరు తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులకు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. టాప్ కాలేజీల్లో సీటు సంపాదిస్తారు. సంపద పెరుగుతుంది. దీంతో గతంలో చేసిన అప్పలు తీర్చి చాలా ఆనందంగా ఉంటారు.

మకర రాశి : మకర రాశి వారికి ఇది అద్భుతమైన, అనుకూలమైన సమయం అని చెప్పాలి. వీరు అనుకున్న పనులు అన్నింటినీ చాలా త్వరగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారి వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. త్వరిత గతిన పనులు పూర్తి చేసుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు