
దొంగమల్లన్న ఆలయం జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం, మల్లన్న పేట గ్రామంలో ఉంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి దాదాపు 10 కిలో మీటర్ల దూరంలో ఈ అద్భుతమైన ఆలయం ఉంటుంది. దీనికి దొంగ మల్లన్న అనే పేరు రావడం, ఈ ఆలయం వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కాగా, ఇప్పుడు మనం ఆలయం వెనకున్న జానపదకథల గురించి వివరంగా తెలుసుకుందాం.

11వ శతాబ్దంలో పొలాస రాజుల కాలంలో ఇద్దరు దొంగలు ఒక ఊరికి వచ్చి ఆవులను దొంగిలించారంట. అయితే వారి వెంట ఆ ఊరివారు తరమడం మొదలు పెట్టారు. దీంతో ఆ దొంగలు చాలా భయపడి పోయారంట. అప్పుడే వారికి తమ పక్కన శివలింగం కనిపిస్తుంది. దీంతో దానిని చూసిన వెంటనే, మమ్మల్ని గుర్తించకుండా కాపాడితే, నీకు గుడి కట్టిస్తాం అని మొక్కుకున్నారంట. దీంతో అప్పటికప్పుడే ఆ ఆవుల రంగు మారిపోయిందంట.అప్పుడు ఆ ఇద్దరు దొంగలు రాత్రికి రాత్రే ఆలయాన్ని నిర్మించారంట.

దీంతో అప్పటి నుంచి ఆ ఆలయాన్ని దొంగ మల్లన్న ఆలయం అంటారంట. మరో కథనం ప్రకరారం చాళక్యుల కాలంలో గ్రామస్థులకు తెలియకుండా ఎవరో రాత్రికి రాత్రి ఆలయాన్ని నిర్మించారంట. అందువలన దీనికి దొంగ మల్లన్న అనే ఆలయం పేరు వచ్చిందని చెప్పుకొస్తు్న్నారు గ్రామస్థులు. అలా ఈ ఆలయం వెనుక అనేక కథలు ఉన్నాయి. ఇది చాలా మహిమగల ఆలయం. దీని గురించి చెబితే అందరూ ఇది ఒక మాయ అని చెబుతారని చెబుతున్నారు పండితులు.

ఇక ఇక్కడ శివలింగం రూపంలో ఉన్న మల్లన్న స్వామిని, ఆ ఊరి గ్రామస్థులు చుట్టుపక్కల ఉన్నవారు, పూజిస్తూ, ఘనంగా జాతర జరిపిస్తారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పంచమి నుంచి 7 వారాల పాటు ఇక్కడ జాతర కొనసాగుతుంది. ఆ గ్రామంలో సందడి వాతావరణం కొనసాగుతుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు