
గణేష్ చతుర్థి వచ్చేస్తుంది. హిందువులు జరుపుకునే పండుగలలో ఇది ముఖ్యమైనది. ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. దీంతో పల్లెల్లో, పట్నంలో ప్రతి వాడ వాడలో వినాయకుడి పాటలు, భజనలతో మార్మోగిపోతాయి. అయితే ఈ సమయంలో గణపయ్య భూలోకానికి వచ్చి తొమ్మిది రోజుల పాటు ఇక్కడే ఉంటాడని భక్తుల నమ్మకం. అయితే ఈ సమయంలో ప్రతి వాడలనే కాకుండా, కొందరు ఇంటిలోపల కూడా విగ్రహాలు పెట్టుకొని పూజిస్తుంటారు.

అయితే వినాయకుడి విగ్రహం ఇంటికి తీసుకొచ్చే క్రమంలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు పండితులు. అవి ఏవి అంటే? వినాయకుడి విగ్రహం కొనుగోలు చేసే క్రమంలో తప్పక దాని తొండం ఎడమ వైపు ఉన్నది కొనుగోలు చేయాలంట. కుడివైపు ఉన్నది కొనుగోలు చేయడం మంచిదే కానీ దీనిని ఇంట్లో పెట్టి పూజలు చేసే క్రమంలో తప్పక ప్రత్యేక పూజలు, ఆలయంలో నిర్వహించే పద్ధతులు పాటించాలంట. ఇక విధులను వదిలి ఎవరూ ప్రత్యేకంగా రోజు మొత్తం పూజలు చేస్తూ ఉండలేరు కాబట్టి ఎడమ వైపు తొండం ఉన్నదే మంచిదంట.

అలాగే తప్ప కుండా గణపయ్య ఎలుక వాహనంపై కూర్చొని ఉన్నది మాత్రమే కొనుగోలు చేయాలంట. ఇది మంచి శుభఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు పండితులు. అలాగే ఎట్టిపరిస్థితుల్లోనూ వినాయకుడు నిలడి ఉన్నది, నాట్యం చేస్తున్నట్లు ఉన్న విగ్రహాలు కొనకూడదంట.

అంతే కాకుండా వినాయకుడి పక్కన ఏనుగు విగ్రహాలు ఉన్నవి కొనుగోలు చేసినా మంచి ఫలితాలు కలుగుతాయంట. అలాగే ఎప్పుడూ కూడా డ్యామేజ్ ఉన్న విగ్రహం కొనుగోలు చేయకూడదు, ఇది చెడు ఫలితాలనిస్తుందని చెబుతున్నారు పండితులు.

వినాయకుడి విగ్రహాన్ని కొందరు మూడు రోజుల పాటు ఇంట్లో పెట్టుకొని పూజలు జరిపిస్తే మరికొంత మంది ఐదు రోజులు లేదా తొమ్మిది రోజుల పాటు పూజలు జరిపిస్తారు. అయితే ఇంట్లో విగ్రహం పెట్టుకొని పూజించే సమయంలో తప్పక కొన్ని నియమాలు పాటించాలంట.ఇంటిని ఎప్పుడూ శుభ్రపరచాలి. తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం పూజ చేసి బొజ్జగణపయ్యకు నైవేద్యం పెట్టాలంట. అలాగే ఇంట్లో నాన్ వెజ్ అస్సలే వండకూదని చెబుతున్నారు పండితులు.