
హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు తన వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ... అయోధ్య ప్రజలు దీపావళిని జరుపుకున్నారట.

మరొక పురాణం కథనం ప్రకారం రాక్షసుడైన నరకాసురుని వధించిన రోజుని నరక చతుర్ధశిగా.. మర్నాడు అమావాస్య రోజున దీపాలు వెలిగించి దీపావళిగా సంబరాలు జరుపుకున్నారట. .

దీపావళి సందర్భంగా ప్రజలు లక్ష్మీ పూజిస్తారు. తమ కుటుంబం లక్ష్మి దేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలంటూ ప్రత్యెక పూజలను చేస్తారు.

దీపావళి రోజున కొత్త వస్తువులను, ముఖ్యంగా ఆభరణాలను కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది.

దీపావళికి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ.. ఇళ్ళు, దుకాణాలను శుభ్ర పరుస్తారు. పండగకుముందే పనులన్నీ పూర్తి చేసుకుంటారు. దీపావళి రాత్రి లక్ష్మి దేవి ఆహ్వానిస్తూ ప్రజల పూజిస్తారు.

దీపావళి కి ప్రత్యేకంగా గృహాలంకరణ చేస్తారు. ఆబాల గోపాలం కొత్త బట్టలను ధరిస్తారు. ప్రత్యెక పిండివంటలను తయారు చేస్తారు. బాణసంచా కాలుస్తారు దీపావళి సోయం గురించి ఎంత చెప్పినా తరగదు.. దివ్య దీపావళి సోయగాలు కన్నులారా వీక్షించాల్సిందే.