అక్షయ తృతీయ రోజు ఇలా లక్ష్మీ పూజ చేస్తే.. మీ ఇంట్లో అష్టైశ్వార్యాలు!

Updated on: Apr 17, 2026 | 5:36 PM

అక్షయ తృతీయ పండుగ అన్నింట్లో కెళ్లా చాలా శుభప్రదమైనది. ఈ రోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తారు. అంతే కాకుండా ఇంటిలో సంపద పెరిగి, అమ్మవారి అనుగ్రహం కలగడానికి ఎన్నో నియమ నిబంధనలు పాటిస్తుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు ఎంత పని ఉన్నా సరే, బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి, అమ్మవారిని పూజిస్తారు. అయితే ఈ రోజు ఇంటిలో ఇలా లక్ష్మీ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వార్యాలు కలుగుతాయంట.

1 / 5
అక్షయ తృతీయ ఏప్రిల్ 19 సోమవారం రోజున వస్తుంది. ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు. ఈ పండుగ రోజు ఎవరు అయినా సరే ఏ కొత్త పని ప్రారంభించినా అది ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతుందంట. అయితే ఈ రోజు పని ప్రారంభించడం, బంగారం కొనుగోలు చేయడం దాన ధర్మాలు చేయడమే కాకుండా ,ఇంటిలో ఇలా లక్ష్మీ పూజ చేస్తే కలిసి వస్తుందంట.

అక్షయ తృతీయ ఏప్రిల్ 19 సోమవారం రోజున వస్తుంది. ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు. ఈ పండుగ రోజు ఎవరు అయినా సరే ఏ కొత్త పని ప్రారంభించినా అది ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతుందంట. అయితే ఈ రోజు పని ప్రారంభించడం, బంగారం కొనుగోలు చేయడం దాన ధర్మాలు చేయడమే కాకుండా ,ఇంటిలో ఇలా లక్ష్మీ పూజ చేస్తే కలిసి వస్తుందంట.

2 / 5
అక్షయ తృతీయ రోజు లక్ష్మీ పూజ ఎలా చేయాలి అంటే? ఉదయాన్నే నిద్రలేచి,  ఇంటిని శుభ్రం చేసి అందంగా అలంకరించాలి. పూలు, మామిడి తోరణాలతో ఇంటిని అలంకరించి, ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయాలి.

అక్షయ తృతీయ రోజు లక్ష్మీ పూజ ఎలా చేయాలి అంటే? ఉదయాన్నే నిద్రలేచి, ఇంటిని శుభ్రం చేసి అందంగా అలంకరించాలి. పూలు, మామిడి తోరణాలతో ఇంటిని అలంకరించి, ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయాలి.

3 / 5
అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేసి, అందంగా అలంకరించాలి. ఉదయం ఏడు లేదా ఆరు గంటల లోపు పూజ చేసి, కుటుంబ సభ్యులకు హారతిని ఇవ్వాలి. ఇక ఈ పూజ కోసం తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా లక్ష్మీదేవి పూజలో ఆవు నెయ్యి, అమ్మవారికి ఇష్టం అయిన నైవేద్యాలు తప్పకుండా ఉండాలి.

అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేసి, అందంగా అలంకరించాలి. ఉదయం ఏడు లేదా ఆరు గంటల లోపు పూజ చేసి, కుటుంబ సభ్యులకు హారతిని ఇవ్వాలి. ఇక ఈ పూజ కోసం తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా లక్ష్మీదేవి పూజలో ఆవు నెయ్యి, అమ్మవారికి ఇష్టం అయిన నైవేద్యాలు తప్పకుండా ఉండాలి.

4 / 5
వెండి చెంబులో నీరుపోసి పైన కొబ్బరికాయ పెట్టి కలశాన్ని ఏర్పాటు చేసి పూజ చేయాలి. అమ్మవారిని స్మరిస్తూ, ఆవు నెయ్యితో దీపం వెలిగించి, హారతి ఇవ్వాలి. ఈరోజు తప్పకుండా లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదవాలి.  అలాగే అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టాలి. అంతే కాకుండా పూలు, గాజులు, చీర, పండ్లు కూడా పెట్టొచ్చు. ఇలా నిష్టగా, భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంటిలో సంపద పెరుగుతుంది.

వెండి చెంబులో నీరుపోసి పైన కొబ్బరికాయ పెట్టి కలశాన్ని ఏర్పాటు చేసి పూజ చేయాలి. అమ్మవారిని స్మరిస్తూ, ఆవు నెయ్యితో దీపం వెలిగించి, హారతి ఇవ్వాలి. ఈరోజు తప్పకుండా లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదవాలి. అలాగే అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టాలి. అంతే కాకుండా పూలు, గాజులు, చీర, పండ్లు కూడా పెట్టొచ్చు. ఇలా నిష్టగా, భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంటిలో సంపద పెరుగుతుంది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us