
మటన్ వెల్లుల్లి కారం గురించి మీరు ఎక్కడ విని ఉండరు. దీనిని ముఖ్యంగా వెల్లుల్లి, మిరప కారం, గరం మసాలాలతో చేసే చేస్తారు. దీనిని రాయలసీమలో ఎక్కువగా చేస్తారు. దీనిని ఎక్కువగా వేడి అన్నం, చపాతీల్లోకి తింటారు. ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

ముందుగా మటన్ బాగా ఉడికించాలి: ముందుగా క్లీన్ చేసిన మటన్కి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్లో బాగా ఉడికించుకోవాలి.

ఇలా వెల్లుల్లి కారం పేస్ట్ వేసుకోవాలి: ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని దానిలో వెల్లుల్లి రెబ్బలు, నాలుగు ఎండుమిర్చి,వేయించిన ధనియాలు, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి పొడి లాగా పట్టుకోవాలి.

ఇప్పుడు పాన్ తీసుకుని ఆయిల్ వేసి అది వేడయ్యాక పోపు గింజలు, కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించాలి. ముందుగా ఉడికించిన మటన్ ను పాన్లో వేసి బాగా వేయించాలి.

ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం, మటన్ ముక్కలకు పట్టేలా 15 నిముషాల పాటు సన్నని మంట మీద వేయించాలి. చివర్లో కొత్తిమీర చల్లుకుని వేడి వేడి అన్నంతో తినడమే.