
రొయ్యలు, ఓస్టెర్, నత్తలు, పీతలు వంటి సీఫుడ్ ను మార్కెట్ నుండి కొనుగోలు చేసిన తర్వాత ఎక్కువసేపు బయట ఉంచవద్దు. వీలైనంత త్వరగా శుభ్రం చేసి ఫ్రిజ్లో ఉంచండి. అందులో చేపలు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టి వండడం వలన ఆహారం బాగుంటుంది. లేకపోతే అవి దెబ్బతినవచ్చు.

ఒకవేళ మార్కెట్ నుండి స్తంభింపచేసిన సీఫుడ్ ( కొనుగోలు చేస్తే) ఖరీదు చేయాలనుకుంటే అది సరిగ్గా నిల్వ చేయబడిందో లేదో తనిఖీ చేయండి. ప్యాక్ చేసిన ఆహారాన్ని కొనుగోలు చేస్తే, దాని గడువు తేదీని తనిఖీ చేయండి. అలా ఉంచిన ఆహారాన్ని తినాలనే ఆలోచన వచ్చినా తయారీ తేదీని ముంచు చుడండి.

మార్కెట్ నుండి సముద్రపు చేపలను కొనుగోలు చేసేటప్పుడు అవి తాజాగా ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. వాసనపై కూడా శ్రద్ధ వహించండి. ఇది అమ్మోనియా వంటి వాసన ఉంటే ఆ చేప తాజాది కాదని అర్థం చేసుకోవాలి. చేపల రంగును చూడండి. ముదురు రంగు, దుర్వాసన ఎక్కువగా కనిపిస్తే ఆ చేపను కొనకపోవడమే మంచిది.

సీఫుడ్, రొయ్యలు లేదా పీతలను చాలా బాగా శుభ్రం చేయాలి. సముద్ర చేపలలో సీసం, కాడ్మియం, నికెల్, ఆర్సెనిక్, రాగి, పాదరసం వంటి భారీ లోహాలు ఉంటాయి. కనుక వాటిని బాగా కడగాలి. లేదంటే అవి శరీరంలోకి ప్రవేశించి గుండెపై ప్రభావం చూపుతాయి.

సీఫుడ్ ను రిఫ్రిజిరేటర్ లో ఉంచినా ఎక్కువ సేపు నిల్వ ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే సీఫుడ్ని ఎక్కువసేపు ఫ్రిజ్లో ఉంచినా బ్యాక్టీరియా సోకుతుంది. అప్పుడు కడుపు నొప్పి, అతిసారం, వాంతులు లేదా ఫుడ్ పాయిజనింగ్కు కారణమవుతుంది. కనుక ఫ్రిజ్లో ఉంచిన సీఫుడ్ ను 3-4 రోజులలోపు తినడం మంచిది.

సముద్రపు ఆహారంలో శరీరానికి హాని కలిగించే వివిధ పరాన్నజీవులు ఉంటాయి. కనుక బాగా శుభ్రం చేసి ఎక్కువ వేడి మీద ఉడికించాలి. అప్పుడే అన్ని క్రిములు నశిస్తాయి. పచ్చిగా లేదా తక్కువ ఉడికించి తింటే అది ప్రమాదకరం.

సాల్మొనెల్లా బ్యాక్టీరియా సముద్రపు ఆహారంలో పెరుగుతుంది. కనుక వండిన ఆహారంతో ముడి సముద్రపు ఆహారాన్ని ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది. కనుక సీఫుడ్ ని ఈ సీజన్ లో తినే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.