
మే వచ్చిందంటే చాలు.. అడుగు పెట్టాలంటే భయం భయంగా ఉంటుంది ఎందుకంటే ఎండలు అంత మండిపోతుంటాయి. అలాగే, సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇంకా ఆరోగ్యాన్ని కూడా మనమే కాపాడుకోవాలి. ఎండ వేడిమి వలన డీహైడ్రేషన్, కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమయంలో చల్లని పానీయం తాగాలి.

అలాంటి పానీయాలలో సోంపు-బెల్లం షర్బత్ కూడా ఒకటి. ఆయుర్వేదంలో ఈ సోంపును బాగా వాడుతారు. ఇంకా దీనిలో సహజంగా శరీరాన్ని చల్లబరిచే గుణాలు దీనిలో ఉన్నాయని చెబుతున్నారు. ఇంకా ఈ వేసవిలో వచ్చే కడుపులో మంట సమస్యలను సోంపుతో చేసిన పానీయాలు తాగితే ఉపశమనం పొందొచ్చు. ఇంకా పుదీనా, పటిక బెల్లం, నిమ్మరసం వంటి వాటిని కూడా వేస్తారు.

ఈ షర్బత్ చేయాలంటే ముందుగా పటిక బెల్లం, నల్ల ఉప్పు, సోంపు గింజలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, మట్టి కుండలోని నీరు కూడా తీసుకోవాలి. ఆ తరవాత సోంపు గింజలను తీసుకుని వాటిని బాగా శుభ్రంగా కడిగి కనీసం రెండు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. అదే విధంగా పటిక బెల్లాన్ని కూడా రెడీ చేసుకోవాలి.

ఇప్పుడు పటిక బెల్లాన్ని తీసుకుని మెత్తగా పొడి చేసుకుని వాటిని సిద్ధం చేసుకోవాలి. అలాగే, దానిలో నానిన సోంపును కొద్దిగా పుదీనాతో కలిపి మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని వడకట్టి అందులోని డ్రింక్ ను పూర్తిగా వేరు చేయాలి. పటిక బెల్లం పొడి, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇంకా నీరును కూడా పోయాలి.

చివర్లో గ్లాసులోకి తీసుకునే ముందు ఐస్ ముక్కలు కూడా దీనిలో ఈ షర్బత్ను పోసి తాగడమే ఇది మామూలు పానీయం కాదు సమ్మర్లో కచ్చితంగా తాగాల్సిన పానీయం. ఇది ఒక్క గ్లాస్ తాగితే వేసవి వేడిని తట్టుకోవచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)