
మనలో ఎంతో మంది కడుపులో ఉన్న మంట, గ్యాస్ ట్రబుల్ తో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇది ప్రధాన సమస్యగా మారింది. అయితే, మీరు ఈ జ్యూస్ తో చిటికెలో చెక్ పెట్టొచ్చు. మరి అస్సలు లేట్ చేయకుండా దీనికి ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

దోసకాయ, పుదీనా జ్యూస్ రెసిపీకి కావాల్సిన పదార్దాలు: ఒక పెద్ద దోసకాయ, 10 పుదీనా ఆకులు, ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా దీనిలో చిటికెడు నల్ల ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ తేనెను తీసుకోవాలి. మీరు దీనిని సరిగ్గా చేసుకుని తాగితే కడుపులో మంట ఇట్టే తగ్గిపోతోంది.

దోసకాయ, పుదీనా జ్యూస్ రెసిపీ తయారీ విధానం: ముందుగా దోసకాయను నీటితో కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని దానిలో దోసకాయ ముక్కలు, ఇంకా నాలుగు పుదీనా ఆకులు, అలాగే నీరు కూడా కొద్దిగా వేసి మెత్తగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి.

దోసకాయ, పుదీనా జ్యూస్ రెసిపీ తయారీ విధానం: ఆ తరవాత దీనిని మీరు వడపోసుకుని ఒక చిన్న గ్లాస్లో పోసుకోవాలి. ఇక చివర్లో దీనిలో అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా కొద్దిగా నల్ల ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. మీకు తియ్యగా కావాలనుకుంటే దీనిలో తేనె కలిపి తాగితే కడుపు కూడా చల్లబడుతుంది. మీ ఇంట్లో ట్రై చేయండి

ఈ రోజుల్లో ప్రతిదీ కల్తీ అయిపోయింది. కాబట్టి, వీలైనంత వరకు నేచురల్ గానే ఇలా తీసుకోండి. (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)