నేడు ఢిల్లీలో యాత్ర తిరిగి ప్రారంభమైన ఈ సందర్భంగా.. ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ స్పెషల్ డైరెక్టర్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) మాజీ సెక్రటరీ అమర్జిత్ సింగ్ దులత్ రాహుల్ గాంధీతో కలిసి యాత్రలో పాల్గొన్నారు.
రా నుంచి పదవీ విరమణ తర్వాత ఏఎస్ దులత్ జనవరి 2000 నుంచి మే 2004 వరకు ప్రధాన మంత్రి కార్యాలయంలో జమ్మూకాశ్మీర్ విషయంలో సలహాదారుగా కూడా పనిచేశారు.
పదవీ విరమణ తర్వాత ఏఎస్ దులత్ జనవరి 2000 నుంచి మే 2004 వరకు ప్రధాన మంత్రి కార్యాలయంలో జమ్మూకాశ్మీర్ విషయంలో సలహాదారుగా కూడా పనిచేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి దులత్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర నేడు ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించింది.
అంతక ముందు ఢిల్లీలో జోడో యాత్ర మళ్లీ ప్రారంభమైన కారణంగా, నగరంలో చాలా చోట్ల ప్రజలు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొన్నారు.
రాహుల్ గాంధీ జోడో పర్యటన సందర్భంగా ప్రజలు తమ ఇళ్ల పైనుంచి పూలవర్షం కురిపించారు.
కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం కల్పించాలని రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రారంభమైన భారత్ జోడో యాత్రలో ఏఎస్ దులత్ కంటే ముందుగా రఘురామ్ రాజన్, పూజా భట్, స్వరా భాస్కర్, సుశాంత్ సింగ్, రష్మీ దేశాయ్, ఆకాంక్ష పూరి, అమోల్ పాలేకర్, రియా సేన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.