
పచ్చి కొబ్బరి, పచ్చి మిర్చితో చేసిన ఈ వంటకం తింటే ఏ నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు. ఈ పచ్చడిని ఎక్కువగా అన్నం, ఇడ్లీ, దోసల్లోకి బాగా తింటారు. ఇంకొందరైతే చపాతీల్లోకి కూడా తింటారు ఎందుకంటే దీనితో ఏది చేసిన రుచి సూపర్. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

పచ్చి కొబ్బరి చట్నీకి కావాల్సిన పదార్దాలు: ఒక కప్పున్నర పచ్చి కొబ్బరి ముక్కలు, 100 గ్రాముల పచ్చి మిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఐదు వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు ఇంకా రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినపప్పు, ఇంకా కొద్దిగా కరివేపాకు ఆకులు వేసుకోవాలి.

పచ్చి కొబ్బరి చట్నీ తయారీ విధానం: ముందుగా గ్యాస్ వెలిగించి పాన్ వేడయ్యాక దానిలో కొద్దిగా నూనె వేసి, ఇంకా దీనిలో పచ్చి మిర్చి , ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత దీనిని కచ్చా పచ్చాగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక కప్పు కొబ్బరి ముక్కలు, వేయించిన పచ్చి మిర్చి వేసి కొంచం గరుకుగా మిక్సీ పట్టుకోవాలి.

పచ్చి కొబ్బరి చట్నీ తయారీ విధానం: అయితే మధ్యలో అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా నాలుగు వెల్లుల్లి, మూడు టేబుల్ స్పూన్స్ నానబెట్టిన చింతపండును కూడా వేసి ,రుచికి తగినంత ఉప్పు కూడా వేసి తగినంత నీళ్లు కూడా పోసి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన తరవాత దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరవాత తాలింపుకు రెడీ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని పోపు పెట్టుకోవాలి : పాన్లో నూనె వేసి అది వేడయ్యాక దానిలో అర టేబుల్ స్పూన్ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినపప్పు, రెండు ఎండుమిర్చి ముక్కలు , కరివేపాకు ఆకులు కూడా వేయించి, ఆ తాలింపును చట్నీలో వేసి కలుపుకుని అన్నంలోకి తినడమే. ఇంకా ఇడ్లీ, దోసల్లోకి కూడా దీనిని తినొచ్చు.