2024 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ ప్యాంటు.. స్వచ్చమైన తెల్లటి రంగు కుర్తా..దానిపై నీలి రంగు ఓవర్కోట్ ధరించారు. అంతేకాదు తలకు నారింజ, ఆకుపచ్చ రంగు బాందినీ చారలతో రాజస్థానీ స్టైల్ తలపాగాను ధరించారు.
2023లో 77వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని మోడీ బహుళ వర్ణ రాజస్థానీ తరహా తలపాగా ధరించి ఎర్రకోట వద్దకు వచ్చారు. అప్పుడు కూడా తెల్లటి కుర్తా , ముదురు నీలం రంగు కోటును ధరించారు.
2022లో స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసే సమయంలో ప్రధాని మోడీ త్రివర్ణ పతాక రంగులు ఉన్న తెల్లటి తలపాగా ధరించారు. తలపాగాతో పాటు భరతీయ సంప్రదాయ తెల్లటి కుర్తా పైజామా సెట్ , నీలిరంగు నెహ్రూ కోటు ధరించారు.
ప్రధాని మోడీ 2021లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కాషాయం రంగు తలపాగాను.. లేత గోధుమ రంగు కుర్తాపై లేత నీలిరంగు ఓవర్ కోటు ధరించారు.
2020లో కోవిడ్-19 వ్యప్తిస్తున్న వేళ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ కాషాయం రంగు లేత గోధుమ రంగు తలపాగాను ధరించారు. అంతేకాదు లేత గోధుమరంగు దుస్తులను ఎంచుకున్నారు. పాస్టెల్.. పాస్టెల్ షేడ్స్ మిక్సింగ్ ఉన్న హాఫ్ స్లీవ్ కుర్తాను ధరించారు.
2019లో 73వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని మోడీ శక్తివంతమైన రాజస్థాన్ స్టైల్ లో పసుపు రంగుతో పాటు పచ్చ రంగు మిళితమైన తలపాగాలో కనిపించారు. అప్పుడు తెలుపు రంగు షార్ట్ హాండ్స్ ఉన్న కుర్తాను ధరించారు.
2018లో ఎర్రకోట వద్ద జరిగిన 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని మోడీ కాషాయ రంగు, కుంకుమ రంగు కలిపిన తలపాగా ధరించారు. తెల్లటి కుర్తా వేసుకున్నారు.
2017లో జరిగిన 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎరుపు రంగులో బంగారు గీతలతో ప్రకాశవంతమైన పసుపు రంగు తలపాగా ధరించి కనిపించారు.
2016లో జరిగిన 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ గులాబీ, ఎరుపు, పసుపు రంగులతో కూడిన తలపాగా ధరించారు. దానితో పాటు తెల్లటి కుర్తా కూడా ధరించారు.
2015లో 69వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఎరుపు, నీలం రంగు చారలున్న పసుపు రంగు తలపాగా ధరించారు. ఆమె లేత గోధుమరంగు కుర్తా, జాకెట్తో చాలా అందంగా కనిపించారు.
2014లో 68వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ తొలిసారిగా ప్రధానమంత్రిగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ముదురు ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగుతో ఉన్న జోధ్పురి బంధేజ్ తలపాగాను ధరించారు.