
ఫుట్ సోక్ (Foot Soak): ముందుగా ఒక టబ్ లో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో రెండు చెంచాల ఉప్పు, కొద్దిగా నిమ్మరసం లేదా షాంపూ కలపండి. ఈ నీటిలో మీ పాదాలను 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టండి. దీనివల్ల పాదాలపై ఉన్న గట్టి చర్మం మెత్తబడి, మురికి సులభంగా వదులుతుంది.

స్క్రబ్బింగ్ (Scrubbing): చర్మం మెత్తబడిన తర్వాత ప్యూమిస్ స్టోన్ లేదా పాత టూత్ బ్రష్ సహాయంతో పాదాల మడమల వద్ద సున్నితంగా రుద్దండి. ఇంట్లోనే స్క్రబ్ తయారు చేసుకోవాలనుకుంటే.. చక్కెరలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా తేనె కలిపి పాదాలపై మసాజ్ చేయండి. చక్కెర మృతకణాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

నిమ్మరసం, గ్లిజరిన్: పాదాలు మరీ నల్లగా ఉన్నా లేదా పగుళ్లు ఎక్కువగా ఉన్నా.. నిమ్మరసం, గ్లిజరిన్, రోజ్ వాటర్ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు పాదాలకు రాసుకోండి. నిమ్మరసంలోని బ్లీచింగ్ గుణాలు నలుపును తగ్గిస్తాయి, గ్లిజరిన్ చర్మానికి తేమను అందిస్తుంది.

మాయిశ్చరైజింగ్ (Moisturizing): శుభ్రం చేసిన తర్వాత పాదాలను పొడి గుడ్డతో తుడిచి, ఏదైనా మంచి కోల్డ్ క్రీమ్ లేదా కొబ్బరి నూనెను రాసుకోండి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. సాక్సులు ధరించడం వల్ల పాదాల తేమ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.

పాదాల సంరక్షణను నిర్లక్ష్యం చేయడం వల్ల చర్మం గరుకుగా మారి, మృతకణాలు పేరుకుపోతాయి. దీనిని నివారించడానికి ప్యూమిస్ స్టోన్ (Pumice stone) లేదా ఇంట్లోనే తయారు చేసుకునే నేచురల్ స్క్రబ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. వారానికి రెండు సార్లు ఈ పద్ధతిని పాటించడం వల్ల పాదాలు శుభ్రంగా ఉండటమే కాకుండా చాలా మృదువుగా తయారవుతాయి.