
ఇప్పుడు చెప్పబోయే ఈ పచ్చడిని ఊర్లలో ఎక్కువగా తింటారు. అయితే, మీరు దీనిని చేసేటప్పుడు మంచి నూనె వాడితే అద్భుత రుచి వస్తుంది. దీనిని ఒక గాజు సీసాలో పెడితే 10 రోజుల పాటు తాజాగా ఉంటుంది. మరి అసలు ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారి విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం

పండు మిర్చి గోంగూర రెసిపీకి కావాల్సిన పదార్థాలు : 150 గ్రాముల పండు మిర్చి, రెండు కట్టలు గోంగూర ఆకులు, 50 గ్రాముల చింతపండు, 15 వెల్లుల్లి రెబ్బలు , పావు టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలును తీసుకోవాలి. వీటిని వేయించి చేస్తే అదిరిపోయే టేస్ట్ వస్తుంది.

పండు మిర్చి గోంగూర రెసిపీకి తయారీ విధానం: ముందుగా రెండు కట్టల గోంగూర ఆకులను వాటిని మూడు సార్లు బాగా కడిగి ఆరనివ్వాలి. అలాగే పండు మిర్చిని కూడా కడిగి పెట్టుకోవాలి. ఆ తరవాత ఒక గిన్నె గ్యాస్ పొయ్యి పెట్టి ఆయిల్ లేకుండా గోంగూరను ఎర్రగా నీరు మొత్తం పోయేదాకా దీనిని బాగా ఉడికించుకోవాలి. ఆ తరవాత దీనిని ఫ్యాన్ కింద బాగా చల్లారనివ్వాలి.

ఇప్పుడు ఇక చిన్న పెనం తీసుకుని దీనిలో కొద్దిగా ఆయిల్ వేసి10 ఎండు మిర్చి, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా 10 మెంతులు బాగా వేయించి దీనిని పొడిలా చేసుకోవాలి. మళ్ళీ అదే పెనంలో ఆయిల్ వేసి 10 వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాలి. దీనిలో ఇంకా గోంగూర, వెల్లుల్లి, రుచికి సరిపడినంత ఉప్పు తీసుకోవాలి

పండు మిర్చి గోంగూర రెసిపీకి తయారీ విధానం స్టెప్ 1 : చివర్లో తాలింపు కోసం ఆయిల్ వేసి అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, కరివేపాకు ఆకులు వేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఈ పోపును తీసుకుని పచ్చడి పై పోసి మంచిగా కలుపుకోవాలి. అంతే వేడి వేడి పండు మిర్చి గోంగూర పచ్చడి రెడీ