
కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు సగ్గుబియ్యం, అర కప్పు సేమియా, మూడు కప్పుల పాలు , 300 గ్రాముల తురిమిన బెల్లం, 5 జీడిపప్పులు, 5 బాదం పప్పులు, 5 జీడిపప్పులు , 6 కిస్ మిస్ లు, అర టీ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి.

ముందుగా గ్యాస్ స్టవ్ లేదా కట్టెల పొయ్యి వెలిగించి పాన్ దాని మీద పెట్టి కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి సగ్గుబియ్యం వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే, బెల్లం లేదా పంచదారను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

పాలు బాగా మరిగిన తర్వాత వేయించుకున్న సగ్గుబియ్యం సేమియాలను వేసి సన్నని మంట మీద ఉంచి 16 నిమిషాల పాటు వాటిని అలాగే బాగా ఉడికించాలి. ఈ మిశ్రమం పాయసంలాగా అయ్యే వరకు స్టవ్ మీదే దానిని పెట్టాలి.

పాలు బాగా మరిగిన తర్వాత వేయించుకున్న సగ్గుబియ్యం సేమియాలను వేసి సన్నని మంట మీద ఉంచి 16 నిమిషాల పాటు వాటిని అలాగే బాగా ఉడికించాలి. ఈ మిశ్రమం పాయసంలాగా అయ్యే వరకు స్టవ్ మీదే దానిని పెట్టాలి.

సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా చేస్తే అవి రుచిగా ఉంటాయి. ఆ తర్వాత వాటిలో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, బాదం పప్పులు, జీడీపప్పులు కూడా వేసి వాటిని బాగా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి సగ్గుబియ్యం, పాయసం రెడీ.