
చలి, ఒత్తిడి వల్ల కూడా వేళ్ల చర్మం రంగు మారవచ్చు. అయితే ఈ లక్షణం మళ్లీ మళ్లీ కనిపిస్తే, గుండె ధమనుల వ్యాధికి సంకేతం కావచ్చు. కాబట్టి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మొదటి దశలో, ముందుగా రోగి చుట్టూ ఎవరూ గుమిగూడకూడదు. ఆ వ్యక్తికి చల్లగా గాలి తగిలేలా చేయాలి. దీని వలన గాలి లోపలికి చొచ్చుకపోయి, రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తగ్గుతుందంట. రెండవ దశలో రోగిని పక్కన పడుకోబెట్టి, కాళ్లను వ్యతిరేక దిశలో చాచి పడుకోబెట్టాలి. తర్వాత అతని పక్కన కూర్చొని ఛాతిపై రెండు చేతులతో గట్టిగా ప్రెస్ చేయాలి. దీని వలన ధమనులలో రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. ప్రమాదం తగ్గుతుంది. CPR సమయంలో, రోగి ఛాతీని దాదాపు 100 నుండి 120 సార్లు గట్టిగా నొక్కాలంట. సకాలంలో సీపీఆర్ చేస్తే వ్యక్తి ప్రాణం కాపాడే అవకాశం ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

మూడు దశలో, స్టెర్నమ్ అనేది కనీసం 3 నుంచి 6 అంగుళాలు ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. అయితే ఇలా చేసే క్రమంలో రోగి పక్కటెముకలు పగులు లేదా ఇతర ఇబ్బందులు అనుభవించినప్పటికీ అంతగా ప్రమాదం లేదు. ఆ సమస్య తర్వాత త్వరగా నయం చేయవచ్చు అని చెబుతున్నారు వైద్య నిపుణులు.

నాలుగవ దశలో, సీపీఆర్ చేస్తున్న క్రమంలో, ఎలాంటి ఫలితం లేకుండా, వారి రంగు మారడం ప్రారంభమైతే, ముఖ్యంగా నీలం లేదా ముదురు రంగులో శరీరం, ముఖం కనిపిస్తే అతని మరణానికి దగ్గరగా ఉన్నట్లేనంట. ఒక వేళ వ్యక్తి శరీరం ఎప్పటిలా మారుతూ ఉంటే ఆ వ్యక్తి కోలుకుంటున్నట్లు అని అర్థం.

ఐదవ దశ వచ్చినప్పుడు కొందరు సీపీఆర్ చేయడం ఆపేస్తారు. కానీ అలా చేయకూడదంట, వ్యక్తి ప్రాణాన్ని కాపాడటానికి ఒక్క నిమిషం పాటీ సీపీఆర్ చేస్తే సరిపోకపోవచ్చును, కొన్ని సార్లు మీ ప్రయత్నం ఆపకుండా రెండు , మూడు నిమిషాల పాటు చేస్తూనే ఉండాలంట. ఇక ఆరవ దశకు వచ్చే సరికి, గుండెపోటు వచ్చిన వ్యక్తి ఐదు నుండి పది నిమిషాలలోపు కోలుకోకపోతే, వారు మరణించారని స్పష్టమవుతుందంట.