
కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు తురిమిన క్యారెట్ ముక్కలు, రెండు గ్లాస్ ల నీళ్ళు, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 4 పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, అర కట్ట కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

పిండి ఈ విధంగా కలుపుకోవాలి: ఒక గిన్నెలో తురిమిన క్యారెట్, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ , పచ్చిమిర్చి ముక్కలు , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, అర కట్ట కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పును వేసి మిక్స్ అయ్యేలా కలుపుకుంటాను.

నీరు పోయడం: ఈ పిండిలో తగినంత నీరు పోసి , దోశ పిండి లాగా జోరుగా కలుపుకోవాలి. ఇలా చేస్తే పెనంపై దోస పలుచగా వేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి, ఈ పిండిని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి.

ఇలా దోశ వేసుకోవాలి : ఇక ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద పెనం పెట్టి దానిలో నూనె వేసి , కొద్దిగా ఆయిల్ రాసి, అది వేడయ్యాక పిండిని దోశలాగా పలుచుగా వేసుకోవాలి.

దోశను రెండు వైపులా కాల్చుకోవాలి : పెనం పై దోశ లాగా పోసి అది ఒక వైపు కాలిన తర్వాత, రెండో వైపు కూడా బాగా బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చిన దోశను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.