
ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం అలా అని ఎలా పడితే అలా తింటే, అనారోగ్య సమస్యలకు గురవుతారు. మనం తీసుకునే ఫుడ్స్ లో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

నాన్ వెజ్ తో కొన్ని రకాల ఫుడ్స్ ను అస్సలు తినకూడదు. తింటే, లేని పోనీ సమస్యలు వస్తాయి. ఏ ఫుడ్స్ తినకూడదు? తింటే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

చిక్కుడు కాయలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే, వెజ్ లవర్స్ కి ఇది బెస్ట్ డిష్ కూడా. అయితే, చికెన్, మటన్ తో చిక్కుడు కాయను తినొద్దు. అలా తింటే, జీర్ణ సమస్యలు వస్తాయి.

బంగాళాదుంపలో పిండి పదార్ధం ఎక్కువగా ఉంటుంది. అలాగే, దీనిలో ప్రోటీన్స్ కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి, చికెన్, మటన్, చేపలు తిన్నప్పుడు దీనిని తీసుకోకపోవడమే మంచిది.

మీరు ఉదయం చికెన్, మటన్ తిని సాయంత్రం ఆకుకూరలు తిన్నా కూడా ఆరోగ్యానికి ప్రమాదమే. కాబట్టి, వీటిని ఇలా కలిపి తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే, రెంటింటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. జీర్ణం కావడానికి సమయం పడుతుంది.