
చియా సీడ్స్: చియా గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. వీటిలోని మెగ్నీషియం, కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తే.. ఐరన్ రక్తహీనతను తగ్గించి బద్ధకాన్ని దూరం చేస్తుంది. వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది.

అరటిపండు: క్షణాల్లో శక్తి కావాలంటే అరటిపండుకు మించినది లేదు. ఇందులో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ శరీరానికి తక్షణ బలాన్ని ఇస్తాయి. పొటాషియం కండరాల తిమ్మిరిని తగ్గిస్తే, విటమిన్ B6 జీవక్రియను మెరుగుపరిచి శరీరాన్ని ఎక్కువ సేపు చురుగ్గా ఉంచుతుంది.

బాదం: బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల శక్తిని పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రతిరోజూ కొన్ని నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల కండరాలు సడలి, శారీరక బలహీనత తొలగిపోతుంది.

వాల్నట్స్: మానసిక అలసట, ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు వాల్నట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శారీరక శక్తితో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

ఓట్స్: ఓట్స్ నెమ్మదిగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండి, రోజంతా శక్తి అందుతుంది. ఇందులోని బి-విటమిన్లు నాడీ వ్యవస్థను బలోపేతం చేసి శారీరక, మానసిక అలసటను తగ్గిస్తాయి.

ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు పగటి పూట కంటే రాత్రిపూట ఆహారం తినకుండా ఉండాలనుకుంటే, గ్రీన్ టీ తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల అనవసరంగా తినకుండా నిరోధించవచ్చు. అంతేకాకుండా ఎక్కువగా ఆహారం తినాలనే కోరికలను కూడా ఇది నివారిస్తుంది.