పసుపు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, అనేక రకాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో పసుపు కలిపి తాగడం వల్ల శరీరంలోని అనేక రకాల నొప్పులు నయమవుతాయి.
పసుపును బొడ్డుపై పూయడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు లభిస్తాయి. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ బాగుంటుంది. పీరియడ్స్లో వచ్చే నొప్పి తగ్గుతుంది. వైరల్ వ్యాధులు దూరంగా ఉంటాయి. పసుపును నాభిలో ఎప్పుడు, ఎలా వేయాలో తెలుసుకుందాం..
చాలా మంది స్త్రీలకు పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. అయితే, పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి, తిమ్మిర్లు సర్వసాధారణం. మహిళలు ఈ సమస్య నుంచి బయటపడటానికి వారి నాభికి పసుపు రాస్తే మంచిది.
పసుపులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అజీర్ణం లేదా మలబద్ధకం వల్ల వచ్చే పొత్తికడుపు నొప్పి , ఉబ్బరం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం కొబ్బరినూనె, పసుపు కలిపి నాభిలో రాయాలి.
పసుపు కూడా ఫైబర్ గొప్ప మూలం. ఇది ఆహారం సరైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీన్ని నాభిలో రాసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసి కడుపునొప్పి, అజీర్తి సమస్య కూడా దూరమవుతుంది.