
మామిడి-పెరుగు కాంబోతో ఎంతో మంది వేసవిలో తింటారు ఇవి ఈ సమయంలో అందరికి అమృతంలా అనిపిస్తాయి.ఈ కాంబినేషన్ మంచిగా అనిపించినా.. కానీ కొన్ని సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇంకా దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఈ రెండు కలిపి తినకూడదని చెబుతున్నారు. పెరుగు వల్ల ఒంటికి చలవ చేస్తే.. మామిడి పండు వేడిని పెంచుతుంది ఇలా ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే టాక్సిన్స్ ఏర్పడే అవకాశం ఉంది దీని వలన చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి మీరు వీటిని కలిపి తీసుకోకండి

ఈ ఆహారాలను తిన్నప్పుడు శరీరంలోని జీర్ణక్రియ పనితీరు కూడా మందగిస్తుంది. అలాగే శరీరంలో విషపూరిత వ్యర్థాలు అలాగే పేరుకుపోతాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఇంకా కడుపులో మంట కూడా వస్తుంది . కొందరిలో వికారం, వాంతులు కూడా అవుతాయి వీటిని దూరం పెట్టడమే మంచిది

మామిడి పండు తిన్న తరవాత కొన్నింటిని అస్సలు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఆ సమయంలో నీళ్లు కూడా తీసుకోవద్దంటున్నారు. దాని వలన కడుపునొప్పి, ఎసిడిటీ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందని అంటున్నారు మామిడి పండు తిన్న తర్వాత 30 నిముషాల పాటు ఆగి, నీళ్లు తాగాలని అంటున్నారు

మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్ ఉపయోగిస్తారు. సమ్మర్లో మామిడి పండు తినే వారు కొంచం ఆలోచించాలని చెబుతున్నారు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)