
పాల నుంచి తయారు చేసే పెరుగులో అనేక పోషకాలు ఉంటాయి ముఖ్యంగా పెరుగులో మన శరీరానికి ఎంతో అత్యవసరమైనటువంటి గట్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ ఉపయోగకరమైన బాక్టీరియా ఉండటం వల్లనే మన శరీరంలో ఆహారం సులువుగా అరుగుతుంది.

అంతేకాదు పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది అదేవిధంగా ప్రోటీన్లకు కూడా పెరుగు అనేది ఒక చక్కటి మూలం అనే చెప్పాలి. పెరుగు చాలా రుచికరంగా ఉంటుంది అంతేకాదు పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది శరీరానికి చలువ చేస్తుంది. . అలాగే పెరుగులో పంచదార వేసుకొని తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు దీన్నే పంజాబీలు లస్సిగా చేసుకొని తాగుతూ ఉంటారు

అలాగే పెరుగును అనేక వంటకాల్లో రుచికోసం కూడా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా బిర్యానీలో పెరుగు వాడకాన్ని మనం గమనిస్తూ ఉంటాము. అలాగే చాట్ కి సంబంధించిన అనేక వంటల్లో కూడా పెరుగును ఎక్కువగా వాడుతూ ఉంటారు. పెరుగు చేసేదహి వడ తినేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

అయితే పెరుగును కొన్ని సందర్భాల్లో తినకూడదని నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో పెరుగు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అవి ఏమేం సందర్భాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పెరుగును రాత్రిపూట తినకూడదని నిపుణులు చెబుతూ ఉంటారు ఎందుకంటే, పెరుగు చాలా ఘనపదార్థం అరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది అదేవిధంగా కడుపులో ఎసిడిటీ పెంచే అవకాశం ఉంది కావున పెరుగన్నం రాత్రిపూట తినకూడదని ఎక్కువగా పెద్దలు చెబుతూ ఉండేవారు. అయితే పగటిపూట మాత్రం పెరుగును తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు.

అదేవిధంగా రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల శరీరంలో డయాబెటిస్ కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు దీనికి కారణం లేకపోలేదు. ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పెరుగు తినుకుంటే శరీరంలో కఫం పెరుగుతుంది. అందుకే రాత్రి సమయంలో పెరుగు తినడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే రాత్రిపూట పెరుగు బదులుగా కాస్త ఉప్పు కలిపిన మజ్జిగ తెసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మజ్జిగలో కొద్దిగా నల్ల ఉప్పు అదే విధంగా కొద్దిగా ధనియాల పొడి కలుపుకొని తాగితే చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే బీపీతో బాధపడేవారు మజ్జిగలో ఉప్పు లేకుండా తాగాలి లేకపోతే బీపీ పెరిగే అవకాశం ఉంది.