బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచేందుకు సమ్మర్ స్పెషల్ లీచీ ఫ్రూట్కు దూరంగా ఉండాలి. అలాగే, మరో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ మామిడిని డయాబెటిస్ రోగులు తినకూడదు. ఇది ఆరోగ్యానికి చాలా హాని కల్గిస్తుంది. అందుకే డయాబెటిస్ రోగులు వీటిని తినకూడదు
డయాబెటిస్ రోగులు ద్రాక్ష పండ్లు తినకూడదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. వేసవి కాలంలో ప్రత్యేకంగా కన్పించే పుచ్చకాయను డయాబెటిస్ రోగులు అధికంగా సేవించకూడదు.
అరటిపండులో కార్బోహైడ్రేట్లు, చక్కెరలు అధికంగా ఉంటాయి. దీని కారణంగా రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో డయాబెటిక్ రోగులు అరటిపండ్లను తినకూడదు. వేసవి కాలంలో ప్రత్యేకంగా కన్పించే పుచ్చకాయను డయాబెటిస్ రోగులు అధికంగా సేవించకూడదు.
పైనాపిల్లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువ. ఇందులో చక్కెర కూడా అధికంగా ఉంటుంది.ఇది రక్తంలో చక్కెరను పెంచుతుంది. ఇది తక్కువ పరిమాణంలో తినాలి. షుగర్ రోగులు ఈ పండుకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు.ఇది శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని పాడు చేస్తుంది.
మధుమేహంతో ఇబ్బందిపడుతున్న వారు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్కు కూడా దూరంగా ఉండాలి. ఇందులో ఎండుద్రాక్ష, ఖర్జూరం, అత్తి పండ్ల వంటి డ్రై ఫ్రూట్స్లో చాలా ఎక్కువ మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తినకుండా ఉండాలి.