
ధర్మశాల వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 21వ మ్యాచ్లో విరాట్ కోహ్లి అద్భుత బ్యాటింగ్ను ప్రదర్శించాడు. న్యూజిలాండ్తో జరిగిన ఈ మ్యాచ్లో 3వ స్థానంలో వచ్చిన కోహ్లి 104 బంతుల్లో 2 సిక్సర్లు, 8 ఫోర్లతో 95 పరుగులు చేశాడు.

ఈ అద్భుత హాఫ్ సెంచరీతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టడం విశేషం.

న్యూజిలాండ్తో జరిగిన ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా తరపున అత్యధిక 50+ స్కోర్లు సాధించిన సచిన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భారత్ గెలిచిన మ్యాచ్లలో 136 50+ స్కోర్లతో మెరిశాడు. ఇప్పుడు కింగ్ కోహ్లీ ఈ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

విరాట్ కోహ్లి న్యూజిలాండ్పై తన అర్ధ సెంచరీతో 137వ సారి భారత విజయంలో 50+ పరుగులు చేశాడు. దీంతో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ప్రత్యేక ప్రపంచ రికార్డును కింగ్ కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు.