
ఆదివారం చెన్నైలో జరిగిన ప్రపంచకప్లో భాగంగా 5వ మ్యాచ్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆదిలోనే టీమిండియాకు షాక్ ఇచ్చిన ఆసీస్ బౌలర్లు.. కోలుకోనివ్వకుండా వెంటవెంటనే మూడు వికెట్లు పడగొట్టారు.

అనంతరం విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సమన్వయంతో ఇన్నింగ్స్ను చక్కదిద్ది, ఊహించిన విజయాన్ని నమోదుచేశారు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు నమోదుచేశారు. అందులో ముఖ్యంగా విజయవంతమైన ఛేజింగ్లలో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు.

ఐదుసార్లు ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియాపై 200 పరుగుల ఛేదనలో టీమిండియా స్టార్ ప్లేయర్ కోహ్లీ 116 బంతుల్లో 85 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 92 ఇన్నింగ్స్లలో 88.98 సగటుతో 5,517 పరుగులు చేశాడు.

ఇంతకుముందు ఈ రికార్డ్ టీమిండియా దిగ్గజ ప్లేయర్ సచిన్ పేరుతో నమోదైంది. మొత్తంగా 124 ఇన్నింగ్స్లలో 5,490 పరుగులు సాధించి భారత జట్టు విజయాల్లో పాలు పంచుకున్నాడు.

2 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన దశలో కేఎల్ రాహుల్తో కలిసి కోహ్లి 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, విజయతీరాలకు చేర్చాడు. జోష్ హేజిల్వుడ్ బౌలింగ్లో కోహ్లి ఔట్ అయ్యాడు. సెంచరీకి 15 పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు.