
క్షిణాఫ్రికాలో జరుగుతున్న SA20 లీగ్లో అగ్రశేణి స్పిన్నర్ రషీద్ఖాన్కు చుక్కలు చూపించాడు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మార్కొ జాన్సెన్. అతని ఓవర్లో 4 సిక్స్లు, 1 బౌండరీతో కలిపి మొత్తం 28 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

SA20 లీగ్లో భాగంగా ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ vs సన్రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే జాన్సెన్ మెరుపు ఇన్నింగ్స్తో సన్రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం సన్రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ జట్టు మరో 3 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది.

లక్ష్య ఛేదనలో 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ జట్టుకు ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు జాన్సెన్. కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 66 పరుగులు చేశాడు.

ముఖ్యంగా రషీద్ ఖాన్ ఓవర్లో 4 సిక్స్లు, 1 బౌండరీతో 28 పరుగులు పిండుకున్నాడు జాన్సెన్. ఈ ఓవర్ మ్యాచ్ను మలుపు తిప్పింది. తన బౌలింగ్ నైపుణ్యంతో ఎంతోమంది స్టార్ క్రికెటర్లకు చుక్కలు చూపించిన రషీద్ఖాన్ ఆఫ్రికా బౌలర్ ధాటికి వెలవెలబోయాడు. దీంతో ముంబై జట్టుకు ఓటమి తప్పలేదు.