
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి, ఈ లీగ్ భారతదేశానికి చాలా మంది స్టార్లను అందించింది. జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు ఈ లీగ్ నుంచే వెలుగులోకి వచ్చారు. ప్రతి సీజన్లో ఈ లీగ్ నుంచి స్టార్లు ఉద్భవిస్తారు. ప్రస్తుతం ఐపీఎల్ 15వ సీజన్ జరుగుతోంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. అయితే ఈ 10 మ్యాచ్ల్లో కొందరు యువ ఆటగాళ్లు ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. అలాంటి యువ ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తొలిసారిగా ఐపీఎల్ ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్ మరో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్తో తొలి మ్యాచ్ ఆడగా, ఈ మ్యాచ్లో 21 ఏళ్ల ఆయుష్ బదోనీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బదోని అర్ధ సెంచరీ చేశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్మన్ బ్యాటింగ్ చేసిన ఆత్మవిశ్వాసం అందరి మనసులను దోచుకుంది. ఇప్పటివరకు ఆయుష్ రెండు మ్యాచ్లు ఆడి 146 స్ట్రైక్ రేట్తో 73 పరుగులు చేశాడు.

తన బ్యాటింగ్ బలంతో పేరు తెచ్చుకున్న మరో ఆటగాడి పేరు తిలక్ వర్మ. వేలంలో ఈ బ్యాట్స్మెన్ కోసం ముంబై ఇండియన్స్ ఎంతో పోరాడింది. చివరకు టీంలో చేర్చుకోవడంతో విజయం సాధించింది. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ కూడా తన ఆటతీరుతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో తిలక్ బ్యాట్తో 83 పరుగులు చేశాడు. ఈ బ్యాట్స్మన్ 41.50 సగటు, 172.91 సగటుతో ఈ పరుగులు చేశాడు.

లలిత్ యాదవ్ ఢిల్లీ తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున కూడా ఆడుతున్నాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్లో ఢిల్లీ పరాజయం పాలైనప్పటికీ చివరి ఓవర్లో లలిత్ ఆకట్టుకున్నాడు. ఈ బ్యాట్స్మెన్ తన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో లలిత్ 73 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 73, స్ట్రైక్ రేట్ 121.66గా నిలిచింది.

వేలంలో వార్తల్లో నిలిచిన మరో పేరు అభినవ్ మనోహర్. సుదీర్ఘ సిక్సర్లు కొట్టడంలో ఈ బ్యాట్స్మెన్కు పేరుంది. గుజరాత్ టైటాన్స్ అతడిని కొనుగోలు చేసి లక్నోతో జరిగిన తొలి మ్యాచ్లో బరిలోకి దించింది. చివరి ఓవర్లలో సిక్సర్లు బాది జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.

బౌలింగ్తో ఆకట్టుకున్న మరో ఆటగాడి పేరు ఆకాశ్దీప్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన ఆకాశ్.. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో తన అద్భుత బౌలింగ్ను ప్రదర్శించాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.