
టీ20 క్రికెట్లో డెత్ ఓవర్లు అంటే 16 నుంచి 20 ఓవర్లకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఓవర్లో గేమ్ను కాపాడడం, చెడగొట్టడం రెండూ ముఖ్యమైనవి. కొన్నిసార్లు బ్యాట్ గెలుస్తుంది. కొన్నిసార్లు బంతి ఆధిపత్యం చెలాయిస్తుంది. కానీ, ఇక్కడ మనం IPL 2022 బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడితే, డెత్ ఓవర్లలో బౌలర్ తమపై ఆధిపత్యం చెలాయించనివ్వరు. బదులుగా వారిపై తీవ్రంగా దాడి చేసి, పరుగులు రాబడుతుంటారు. ఐపీఎల్ 15వ సీజన్లో డెత్ ఓవర్లలో 'సిక్సర్ కింగ్' లా మారిన వారిని ఓసారి చూద్దాం..

షిమ్రాన్ హెట్మెయర్ - IPL 2022లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్లలో 21 సిక్సర్లు కొట్టాడు. అందులో అతను డెత్ ఓవర్లలోనే 19 సిక్సర్లు కొట్టాడు. మిడిలార్డర్లో అతను బ్యాటింగ్కు రావడమే దీనికి ప్రధాన కారణం. రాజస్థాన్ రాయల్స్ తరపున హెట్మెయర్ చివరి ఓవర్లు మిగిలి ఉన్నప్పుడే క్రీజులోకి వచ్చాడు.

దినేష్ కార్తీక్- IPL 2022 దినేష్ కార్తీక్కు గొప్పగా సాగుతోంది. డెత్ ఓవర్లలో అతని పేరు మీద 18 సిక్సర్లు నమోదవడం కూడా దీనికి మరో కారణం. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్లలో దినేష్ కార్తీక్ 21 సిక్సర్లు కొట్టాడు. అందులో అతను డెత్ ఓవర్లలో 18 సిక్సర్లు సాధించాడు.

రాహుల్ తెవాటియా- గుజరాత్ టైటాన్స్కు చెందిన రాహుల్ తెవాటియా IPL 2022లో తన జట్టు మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. అతను జట్టు కోసం చాలా మ్యాచ్లు గెలిచాడు. రాహుల్ తెవాటియా ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్లలో మొత్తం 9 సిక్సర్లు బాదాడు. అందులో అతను డెత్ ఓవర్లలో 8 సిక్సర్లు కొట్టాడు.

ఎంఎస్ ధోని - చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, ఎంఎస్ ధోని 12 మ్యాచ్లలో 9 సిక్సర్లను బాదేశాడు. అయితే ఈ 9 సిక్సర్లలో డెత్ ఓవర్లలోనే 7 సిక్సర్లు కొట్టాడు. ఈ సీజన్లో చెన్నై జట్టు టైటిల్ రేసు నుంచి నిష్క్రమించినప్పటికీ, ధోని బ్యాటింగ్ వార్తల్లో నిలిచింది.