ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో అనేక ప్రత్యేక సంఘటనలు చోటు చేసుకోనున్నాయి.
నేటి మ్యాచ్లో సీఎస్కే ఛాంపియన్గా నిలిస్తే.. ఐదోసారి ట్రోఫీని కైవసం చేసుకుంటుంది. జీటీ గెలిస్తే వరుసగా రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంటుంది. కాగా, ఈ మ్యాచ్లో ఎంఎస్ ధోని, శుభ్మన్ గిల్లు చారిత్రక రికార్డును లిఖించేందుకు సిద్ధమయ్యారు.
మహేంద్ర సింగ్ ధోనీ ఈరోజు రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు సమాచారం. IPL 2023 ప్రారంభమైనప్పటి నుంచి, ధోని రిటైర్మెంట్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. దీనిపై ధోనీతో సహా ఎవరూ ఇప్పటి వరకు ఎలాంటి కచ్చితమైన సమాచారం వెల్లడించలేదు.
టాస్ సమయంలో లేదా మ్యాచ్ తర్వాత, ధోని రిటైర్మెంట్ గురించి చాలాసార్లు అడిగారు. అయితే ఈ విషయంపై ఆయన మౌనంగా ఉన్నాడు. నేడు ఫైనల్ మ్యాచ్ కావడంతో రిటైర్మెంట్కు అవకాశం ఉందని అంటున్నారు.
రిటైర్మెంట్ తర్వాత ధోనీ CSK జట్టు కోచ్గా మారే అవకాశం ఉంది. అయితే, ఓ మ్యాచ్ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ.. నేను రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 8 నుంచి 9 నెలల సమయం ఉంది. నేను ఆడినా లేదా జట్టుకు దూరంగా ఉన్నా ఎప్పుడూ చెన్నై సూపర్ కింగ్స్ మద్దతుదారుడిగానే ఉంటాను అని చెప్పుకొచ్చాడు.
దీని ద్వారా ధోనీ పరోక్షంగా తనకు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల సమయం ఉన్నందున ఇది తన చివరి ఐపీఎల్ అని, అతను ఆటగాడు అవుతాడో లేదా కోచ్గా ఉంటానో తనకు తెలియదని, కానీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతోనే ఉంటానని చెప్పుకొచ్చాడు.
ఎంఎస్ ధోని ప్రస్తుతం మోకాలి సమస్యతో బాధపడుతున్నాడు. అయినా, మ్యాచ్లు ఆడుతూనే ఉన్నాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోనికి చికిత్స చేయనున్నారు. ఈరోజు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించి చెన్నై విజయంతో వీడ్కోలు పలుకుతాడో లేదో చూడాలి.