
వరలక్ష్మి శరత్ కుమార్.. నటుడు శరత్ కుమార్ వారసురాలిగా సినీ అరంగేట్రం చేసి అద్భుతమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అందరి అమ్మాయిల్లాగా కాకుండా.. విలనిజంతో మెప్పిస్తోంది వరలక్ష్మి.

తెనాలి రామకృష్ణ బీఏ, బీఎల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. ఆతర్వాత మాస్ మాహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించి మెప్పించింది

ఆ తర్వాత నాంది, చేజింగ్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె కీలకపాత్రలో నటిస్తోన్న చిత్రం యశోద. ఇందులో సమంత కథానాయికగా నటిస్తోంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.

సరోగసీ కాంప్లికేటెడ్ ఏమీ కాదు. కొంతమంది యాక్టర్స్ సరోగసీని ఆశ్రయించడం వల్ల డిస్కషన్స్ జరుగుతున్నాయి. పిల్లలు లేని చాలా మందికి సరోగసీ ద్వారా పొందే అవకాశం కలుగుతోంది అని అంది వరలక్ష్మీ

ప్రస్తుతం సెలబ్రెటీల జీవితంలో సరోగసి గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరికి వారు జీవితంలో సంబంధించిన విషయాలను పక్కన పెట్టేసి వేరే వారి జీవితంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా గమనిస్తూ ఉంటున్నారు. దీనికి కారణం వాళ్లకు పని లేకపోవడమే అంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది.

సరోగసీ గురించి ఇండియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. కథ ఏ విధంగా ఉండబోతోంది? అని అడగ్గా.. సరోగసీ కాంప్లికేటెడ్ ఏమీ కాదు. కొంతమంది యాక్టర్స్ సరోగసీని ఆశ్రయించడం వల్ల డిస్కషన్స్ జరుగుతున్నాయి అని చెప్పుకొచ్చింది