
రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోల చిత్రాలతో మెప్పిస్తూ ఉన్నారు త్రిష. ఇప్పుడు 2.0 వెర్షన్ అన్నట్టు.. ఇంకా అందంగా కనిపించడానికి కృషి చేస్తున్నారు. నటన తప్ప ఇంకే విషయం మీదా నా ఫోకస్ లేదు. ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నానంటున్నారు త్రిష.

రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయినా, చారిత్రాత్మక సబ్జెక్ట్ అయినా పెర్ఫార్మెన్స్ ప్లస్ గ్లామర్ కి స్కోప్ ఉంటే, మేకర్స్ ఫస్ట్ ఛాయిస్ త్రిషే అవుతున్నారు. తన సినిమాల్లో త్రిషను బ్యాక్ టు బ్యాక్ తీసుకోవడానికి రీజన్ కూడా అదేనని ఈ మధ్య రివీల్ చేశారు స్టార్ కెప్టెన్ మణిరత్నం.

ఈ ఏడాది ఆల్రెడీ ఒకటికి నాలుగు సినిమాలతో పలకరించారు త్రిష. హిట్టూ, ఫ్లాపులూ సమానంగా తీసుకుంటానని చెబుతున్నారు ఈ లేడీ. అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే, సూర్యతో నటించే కరుప్పు కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. సూర్య, త్రిష జోడీకి కోలీవుడ్లోనే కాదు.. సినిమా సర్కిల్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది. ఆ మేజిక్ని కరుప్పులో చూడ్డానికి మేం రెడీ అంటున్నారు ఫ్యాన్స్.

ఈ దీపావళికి రిలీజ్ అవుతుందనుకున్న కరుప్పు వచ్చే ఏడాది సంక్రాంతికి షిఫ్ట్ అయ్యే సూచనలు చాలానే కనిపిస్తున్నాయి. సో 2026 సంక్రాంతికి కరుప్పు, సమ్మర్కి విశ్వంభరతో రెడీ అవుతున్నారు త్రిష. కోలీవుడ్లో కరుప్పు కి ఎంత క్రేజ్ ఉందో, స్టాలిన్ తర్వాత వచ్చే విశ్వంభరకి టాలీవుడ్లోనూ అంతే క్రేజ్ ఉంది.

ఓ వైపు సిల్వర్ స్క్రీన్ మీద సినిమాలు చేస్తూనే, మరోవైపు ఓటీటీ ప్రాజెక్టులను కూడా డీల్ చేస్తున్నారు ఈ బ్యూటీ. పోలీస్ ఆఫీసర్గా త్రిష నటించిన బృంద ఫస్ట్ సీరీస్ జనాలను మెప్పించింది. అందుకే నయా కేస్తో బృంద మళ్లీ రెడీ అంటూ సెకండ్ చాప్టర్ని అనౌన్స్ చేశారు మేకర్స్.