
అఫీషియల్ అప్డేట్స్ లేకపోయినా... ఎస్ఎస్ఎంబీ 29ను న్యూస్లో ఉంచటంలో సూపర్ ఫామ్ చూపిస్తున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. రీసెంట్గా నవంబర్లో బిగ్ రివీల్ అంటూ క్లారిటీ ఇచ్చారు జక్కన్న. ఇప్పుడు ఈ న్యూస్కు కొనసాగింపుగా మరో క్రేజీ అప్డేట్ ఫిలిం సర్కిల్స్లో వైరల్ అవుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29. గ్లోబల్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో కొత్త స్ట్రాటజీ సిద్ధం చేశారు జక్కన్న.

గతంలో తన సినిమాలకు వరుస అప్డేట్స్ ఇచ్చిన రాజమౌళి, ఈ మూవీకి మాత్రం అఫీషియల్ అప్డేట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.మహేష్ బర్త్ డే సందర్భంగా అప్డేట్ కోసం నవంబర్ వరకు వెయిట్ చేయల్సిందే అన్న క్లారిటీ ఇచ్చారు జక్కన్న.

అయితే అన్ని అకేషన్స్ వదిలిపెట్టి రాజమౌళి నవంబర్ కే ఎందుకు ఫిక్స్ అయ్యారన్న విషయంలో ఓ ఇంట్రస్టింగ్ థియరీ వైరల్ అవుతోంది. ఓ హాలీవుడ్ లెజెండ్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేయించేందుకే జక్కన్న నవంబర్కు ఫిక్స్ అయ్యారన్నది లేటెస్ట్ అప్డేట్.

అవతార్ 2 ప్రమోషన్స్లో భాగంగా నవంబర్లో ఇండియాలో పర్యటించబోతున్నారు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. ఆ టైమ్లోనే ఎస్ఎస్ఎంబీ 29 ఈవెంట్ ప్లాన్ చేస్తే కామెరూన్ కూడా అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే నవంబర్లో ఈవెంట్ ఉంటుందన్న హింట్ ఇచ్చారు జక్కన్న. మరి ఈ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.