
ఒకప్పుడు వరస సినిమాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ తన అందం, అభినయంతో నెట్టింట సందడి చేస్తుంది.

ఈ చిన్నది వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది తర్వాత వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి, టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా సత్తా చాటింది.

టాలీవుడ్ లో స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించిది. ఇక కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే ఈ బ్యూటీ బాలీవుడ్ చక్కేసిది. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్లో సినిమాలు, వెబ్ సీరీస్లు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది.

బాలీవుడ్ నిర్మాతను వివాహం చేసుకున్న తర్వాత ఈ చిన్నదానికి అవకాశాలు చాలా వరకు తగ్గాయి. దీంతో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ, బిజినెస్లు చూస్తూ గడిపేస్తుంది.

ఇక ఏమాత్రం సమయం దొరికినా సరే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ, తన బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ కలర్ డ్రెస్లో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. ఇవి అభిమానుల మనసు దోచేసుకుంటున్నాయి.