
ఫైనల్గా ఎస్ఎస్ఎంబీ 29 వర్క్ షురూ చేసిన జక్కన్న నెమ్మదిగా స్పీడు పెంచుతున్నారు. సైలెంట్గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసి రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. ప్రజెంట్ మహేష్ వెకేషన్ బ్రేక్లో ఉండటంతో ఈ గ్యాప్లో ప్రీ ప్రొడక్షన్ పనుల స్పీడు పెంచారు.

ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరో లీడ్ రోల్ చేస్తుంది. అయితే ఇది కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రని తెలుస్తోంది. ఇదిలా ఉంటె ఎస్ఎస్ఎంబీ 29కు రాజమౌళితో పాటు మరో దర్శకుడు కూడా వర్క్ చేస్తున్నారు.

గతంలో బాహుబలి సినిమా కోసం కొన్ని డైలాగ్స్ రాసిన దేవా కట్ట, మహేష్ మూవీకి కూడా డైలాగ్స్ అందించారు. బాహుబలి సినిమాలో ఏది మరణం అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్కు థియేటర్లు ఊగిపోయాయి. ఇది ఆ దర్శకుడు రాసిందే.

అందుకే మహేష్ కోసం అలాంటి హై ఎమోషనల్ డైలాగ్ను ప్లాన్ చేస్తున్నారు దేవా కట్ట. అయన ఇచ్చినా డైలాగ్స్ సినిమాకే హైలెట్ కానున్నాయని సమాచారం. ఇప్పటికే దేవా కట్ట తన వర్షన్ డైలాగ్స్ కంప్లీట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది.

అయితే కొన్ని సీన్స్కు మాత్రమే దేవ కట్ట వర్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. అడ్వంచరస్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ వరదరాజ మన్నార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.