
ఆదిపురుష్ సినిమా ఉన్నట్టుండి ట్రెండింగ్లోకి వచ్చేసింది. పోయిన సినిమాను పోనివ్వకుండా, డైరక్టర్ మళ్లీ ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏంటని కోపంగా ఉన్నారు రెబల్ ఫ్యాన్స్. అసలు బిజినెస్కీ, కలెక్షన్లకూ తేడా తెలియనివారు సినిమా చేయబట్టే.. రిజల్ట్ అలా ఉందని అంటున్నారు నెటిజన్లు.. ఇంతకీ ఓమ్ కమ్ టు మై రూమ్ అని అనాల్సిన సిట్చువేషన్ మరో సారి క్రియేట్ అయినట్టేనా?

ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ జానకీదేవిగా నటించిన సినిమా ఆదిపురుష్. మర్యాదపురుషోత్తముడి కథను జనాలకు నచ్చేటట్టు చెప్పడంలో ఎక్కడో ఫెయిల్ అయ్యారు ఓమ్ రవుత్.

ఆ సినిమాను మర్చిపోతున్న ఆడియన్స్ కి ఇప్పుడు వేవ్స్ వేదిక మీద మరోసారి గుర్తుచేశారు. అదీ సంగతి... స్టార్ హీరోలకున్న విస్తృతమైన మార్కెట్ని మెన్షన్ చేస్తూ ఆదిపురుష్ని ఎగ్జాంపుల్గా చెప్పారు ఓమ్.

ప్రీ రిలీజ్ టైమ్లో ఆదిపురుష్ తెలుగు బిజినెస్ 120 కోట్లు అయిందని ప్రస్తావించారు. అంత వరకు బాగానే ఉన్నా.. '120 కోట్ల బిజినెస్ జరిగిందంటే అంత మంది చూసినట్టే కదా..' అని ఆయన అన్న తీరుకు గుస్సవుతున్నారు ఫ్యాన్స్.

బిజినెస్కీ, కలెక్షన్లకీ తేడా తెలియకపోతే ఎలా అంటూ ఫీలవుతున్నారు. రీసెంట్గా సైఫ్ అలీఖాన్ కూడా ఆదిపురుష్ని ప్రస్తావించారు. తన కొడుకుతో కలిసి సినిమా చూశానని, పిల్లాడి చూపులను బట్టే.. ' ఈ సినిమాను నాకెందుకు చూపిస్తున్నావు' అనే భావం అర్థమైందని, సారీ చెప్పుకున్నానని అన్నారు సైఫ్. ఇలాంటి తరుణంలో ఓమ్ మాటలు విని నెత్తి పట్టుకుంటున్నారు రెబల్ సైనికులు.