
లేడీ సూపర్ స్టార్ నయనతార.. పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఆమె ఒకరు. తెలుగుతోపాటు తమిళం, హిందీలోనూ వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న కొత్త ప్రాజెక్టులో నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.అయితే రూ.100 కోట్లు ఇచ్చినప్పటికీ ఓ హీరోతో నటించనని ముఖం మీదే చెప్పేసిందట నయన్. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. ?

ప్రస్తుతం చిరంజీవితోపాటు కేజీఎఫ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ చిత్రంలోనూ నటిస్తుంది. ఇవే కాకుండా తమిళంలో మరిన్ని సినిమాలకు సైతం నయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో నటించనని చెప్పేసిందట నయన్. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. అతడే శరవణన్.

ది లెజెండ్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు శరవణన్. 2022లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే తన సినిమాలో నయనతారను కథానాయికగా తీసుకోవాలని భావించాడట. కానీ ఆ సినిమా అవకాశాన్ని నయన్ సున్నితంగా రిజెక్ట్ చేసిందని సమాచారం.

ది లెజెండ్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు శరవణన్. 2022లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే తన సినిమాలో నయనతారను కథానాయికగా తీసుకోవాలని భావించాడట. కానీ ఆ సినిమా అవకాశాన్ని నయన్ సున్నితంగా రిజెక్ట్ చేసిందని సమాచారం.