
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ త్వరలోనే ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. ప్రభాస్ రాముడిగా నటించిన ఈ సినిమాలో కృతి సీతగా కనిపించనుంది.

ఈ సందర్భంగా ఫ్లోర్ లెంగ్త్ బ్లాక్ అండ్ వైట్ ఫ్లవర్ ఎంసెట్ గౌను లో మిలమిలా మెరిసిపోయింది కృతి. ఈ గౌనులో నలుపు రంగు రఫిల్డ్, ఆఫ్ షోల్డర్ నెక్లైన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ఈ డ్రెస్ ధర రూ.61,575.

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న కృతి తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

కృతి సనన్ వెస్ట్రన్ లోనే కాకుండా ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా చాలా అందంగా కనిపిస్తోంది. గతంలో ఆమె నటించిన బ్లాక్ కలర్ దుస్తులు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి.

మహేశ్ బాబు నటించిన వన్.. నేనొక్కడినే అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది కృతి సనన్. ఆతర్వాత బాలీవుడ్లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా క్రేజ్ సొంతం చేసుకుంది.