
ఒక్క సినిమాతోనే నేషనల్ సెన్సేషన్గా మారిపోయారు హాట్ బ్యూటీ అదా శర్మ.

దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా రాని గుర్తింపు ఒక్క సినిమాతోనే రావటంతో తన వాయిస్ను గట్టిగానే రెయిజ్ చేస్తున్నారు.

ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న సమస్య గురించి స్ట్రాంగ్ కామెంట్స్ చేస్తున్నారు ఈ బ్యూటీ.

హార్ట్ ఎటాక్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అదా శర్మకు ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసిన అనుకున్న రేంజ్లో గుర్తింపు మాత్రం రాలేదు.

దీంతో సిల్వర్ స్క్రీన్ కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా హడావిడి చేస్తూ వచ్చారు అదా.

కానీ రీసెంట్ బ్లాక్ బస్టర్ ది కేరళ స్టోరి ఈ బ్యూటీ ఇమేజ్ను మార్చేసింది.

ఎన్నో వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏకంగా 200 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చేయటంతో అదా గురించి నార్త్ సర్కిల్స్లో డిస్కషన్ జరుగుతోంది.

అయితే ఇన్నాళ్లు తనను పక్కన పెట్టిసిన ఇండస్ట్రీ మీద అదా శర్మ కూడా గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు.

బాలీవుడ్లో జెండర్ డిస్క్రిమినేషన్ ఉందన్న అదా శర్మ... ఆ పరిస్థితుల వల్ల తాను కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు.

ముఖ్యంగా హీరోయిన్లను టైమ్కు సెట్కు రావాలని కండిషన్స్ పెట్టే మేకర్స్... హీరోలు వచ్చే వరకు హీరోయిన్లు ఖాళీగా కూర్చోబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దర్శకులు కూడా హీరో హీరోయిన్లను సమానంగా ట్రీట్ చేసినప్పుడే అవుట్పుట్ సరిగా వస్తుందన్నారు అదా. ఒకరిని గౌరవంగా చూసి మరొకరిని అవమానిస్తే ఆ ఎఫెక్ట్ సినిమా మీద కూడా పడుతుందని సజెషన్ ఇచ్చారు.