
బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ అ, ఆ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమతోనే అందరి మనసు దోచేసుకుంది. ఈ మూవీలో ఈ అమ్మడు సెకండ్ హీరోయిన్గా, నాగవల్లి పాత్రలో తన అద్భుతమై నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి తెలుగులో అవకాశాలు క్యూకట్టాయి.

ఈ మూవీ తర్వాత శర్వానంద్ శతమానం భవతి సినిమాలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణా్జున యుద్ధం, హలో గురు ప్రేమ కోసమే,రాక్షసుడు, 18 పేజీస్, సీతాకోక చిలుక, ఈగల్, టిల్లు స్క్వేర్ , కిష్కంద పురి, పరదా వంటి సినిమాల్లో నటించింది.

ముఖ్యంగా ఈ బ్యూటీ టిల్లు స్క్వేర్ మూవీలో తన గ్లామర్తో ప్రతి ఒక్కరి మనసు దోచేసింది. దీని తర్వాత అనుపమ చాలా సినిమాల్లో నటించి, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. వరసగా సినిమాలు చేస్తూ ఫల్ బిజీ బిజీగా గడిపేస్తుంది.

అయితే ఈ అమ్మడు వరసగా సినిమాలు చేస్తూ, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తున్నప్పటికీ, ఈ బ్యూటీ మాత్రం స్టార్ హీరోయిన్గా తన సత్తా చాటలేకపోయింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటే ఈ బ్యూటీ తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా కలర్ ఫుల్ డ్రెస్లో కనిపించి, తన అభిమానులకు అందాల విందునిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.