
ఈ సారి ఏప్రిల్ నుంచే వడగాలులు మొదలయ్యాయి. అంతేకాదు, ఎండలు కూడా మండిపోతున్నాయి. అంతకముందు కంటే, ఏఈ సారి అధిక టెంపరేచర్ తో రికార్డ్ బ్రేక్ చేస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే అనేక ఏరియాల్లో ఉష్ణోగ్రతలు ఒక రేంజ్లో నమోదవుతున్నాయి.

బయట ఎండ దెబ్బకు ఎంతో మంది ఇంట్లో కూలర్లు, ఏసీల కింద ఉంటున్నారు. దీని వలన వేడి నుంచి ఉపశమనం దొరుకుతున్నా ఇంకో వైపు కరెంట్ బిల్ విపరీతంగా పెరగడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ టిప్స్ .

ఏసీని నార్మల్ ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. అంటే 24 నుంచి 25 డిగ్రీల మధ్య టెంపరేచర్ ఉంచాలి. దీని వలన ఏసీపై కొంత ఒత్తిడి తగ్గి, శరీరానికి కూడా మంచిగా ఉంటుంది. తక్కువ టెంపరేచర్లో ఉంచడం వలన విద్యుత్ తగ్గుతుంది.

ఏసీని ఆఫ్ చేయడానికి రిమోట్ ను తప్పక ఉపయోగించాలి. మీరు డైరెక్ట్ గా పవర్ ఆఫ్ చేస్తే విద్యుత్లో తేడాలు వచ్చి, లోపల భాగాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఆ తరువాత ఇది ఎక్కువ ఖర్చు పెరిగేలా చేస్తుంది.

ఇంకా రూమ్ డోర్స్ , కిటికీలు క్లోజ్ చేసి ఉంచడం కూడా అవసరం. దీని వలన చల్లని గాలి బయటకు పోతే, ఏసీ ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. ఫిల్టర్లు, కూలింగ్ కాయిల్స్ను క్లీన్ చేస్తూ ఉండాలి. దీని వలన పవర్ బిల్ కూడా తగ్గుతుంది.