
అరటిపండు అందరికీ అందుబాటులో ఉండే పండ్లలో ఒకటి. అవి ఏడాది పొడవునా అన్ని ప్రాంతాల్లో అన్ని కాలాల్లో అందుబాటులో ఉంటాయి. ఇది ఫైబర్, పొటాషియం, మంచి కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి వంటి అనేక పోషకాలతో నిండి ఉంటుంది. అరటిపండులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.

ఈ కారణంగానే కొందరు అరటి పండుకు దూరంగా అంటారు. అయితే డయాబెటిస్ పేషెంట్లు అరటి పండు తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

అరటిపండులో చక్కెర, కేలరీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. అరటిపండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర ఖచ్చితంగా పెరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

అరటిపండ్లు రక్తంలో చక్కెరను ఎందుకు పెంచుతాయంటే.. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్తోపాటు చక్కెర శాతం ముఖ్యకారణం. ఎందుకంటే ఫైబర్ రక్తంలో చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. అయితే వీరు అరటి పండు మితంగా తింటే సరిపోతుంది.

మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అరటి పండు మంచి ఎంపికే. అరటిపండ్లలోని అధిక ఫైబర్ కంటెంట్ శరీర బరువును త్వరగా తగ్గిస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అరటిపండ్లు మీ డైట్లో జోడించవచ్చు.