
భారతీయ సంస్కృతిలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. వివాహాల సమయంలో అయితే బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందువల్ల ప్రతి సంతోషకరమైన క్షణంలో ప్రతి ఒక్కరూ బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తారు, అలాగే ధరిస్తారు.

కానీ గత కొన్ని రోజులుగా నిరంతరం పెరుగుతున్న బంగారం ధర అందరికీ అందుబాటులో లేకుండా పోయింది. అయితే తాజాగా బంగారం ధర తగ్గింది. బంగారం కొనాలనుకుంటున్న వారికి ఇది మంచి సమయంగా చెప్పొచ్చు.

గత సంవత్సరం నుండి బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గతంలో వేల రూపాయలు ఖరీదు చేసే బంగారం ఇప్పుడు లక్షల రూపాయలకు అమ్ముడవుతోంది. అయితే ఇప్పుడు బంగారం ధరలు ఎంత తగ్గాయో తెలుసుకుందాం..

మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బంగారం ధర రూ.1,100 తగ్గగా.. వెండి ధర రూ.10,000 వరకు తగ్గింది.

ఈ తగ్గుదలతో బంగారం, వెండి ధరలు సామాన్యులకు కాస్త అందుబాటులోకి వచ్చినట్లు భావించాలి. బంగారం ధరలు జీఎస్టీతో సహా రూ.1 లక్ష 59 వేల 135కి చేరుకున్నాయి. వెండి ధరలు జీఎస్టీతో సహా రూ.2 లక్షల 52 వేల 350కి చేరుకున్నాయి.