
కేంద్రం బడ్జెట్ ప్రకటించిన క్రమంలో బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గోల్డ్ రేట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. బడ్జెట్ ప్రకటించాక మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవ్వడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. బడ్జెట్లో ప్రకటించే నిర్ణయాలు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. దీంతో గోల్డ్ రేట్లపై కూడా బడ్జెట్ ప్రభావం అనేది ఉంటుంది. ఈ కారణంతో బడ్జెట్ ప్రకటన తర్వాత బంగారం ధర ఒక్కసారిగా భారీగా పతనమైంది.

హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ఒకేసారి రూ.9 వేలు తగ్గింది. ప్రస్తుతం గోల్డ్ రేటు రూ.1,51,530 వద్ద కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర రూ.1,60,580 వద్ద స్ధిరపడింది. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.9,050 తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,38,900గా ఉంది. నిన్న రూ.1,47,200 వద్ద ఉండగా.. ఏకంగా రూ.8,300 తగ్గముఖం పట్టింది.

ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారంపై రూ.9 వేలు తగ్గింది. ఇక చెన్నైలో అయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10,370 పడిపోయింది. ప్రస్తుతం రూ.1,52,180గా ఉండగా.. నిన్న రూ.1,62,550 వద్ద ధర స్ధిరపడింది. ఇక 22 క్యారెట్ల ధరపై సోమవారం రూ.9,500 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల ధర రూ.1,39,500గా కొనసాగుతోంది.

ఇక ఢిల్లీలో ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,680 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,39,050గా ఉంది. అటు వెండి ధరలు ఒకేసారి రూ.50 వేలు తగ్గింది. నిన్న ఢిల్లీలో కేజీ వెండి రూ.3,50,000గా ఉండగా.. ఇవాళ రూ.3 లక్షలు చేరుకుంది. ఇక హైదరాబాద్లో మాత్రం సిల్వర్ ధర స్వల్పంగా తగ్గింది.

సోమవారం హైదరాబాద్లో కేజీ వెండి రేటు రూ.3 లక్షలుగా ఉంది. నిన్న ఈ ధర రూ.3.20 లక్షల వద్ద స్ధిరపడింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నై, బెంగళూరులో కూడా వెండి ధరలు తగ్గాయి. చెన్నైలో కేజీ వెండి ప్రస్తుతం రూ.3 లక్షలు ఉంది.

ఇక బెంగళూరులో వెండి ధర భారీగా పడిపోయింది. నిన్న రూ.3.50 లక్షలుగా ఉండగా.. ఇవాళ రూ.3 లక్షలకు తగ్గిపోయింది. బంగారం ధరల్లో ఎప్పుడు పడిపోతాయో.. ఎప్పుడు తగ్గుతాయో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. దీంతో కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు కొనుగోలు చేయాలా.. వద్దా అని పదిసార్లు ఆలోచించుకుంటున్నారు. మొత్తానికి మొన్నటివరకు ధరలు పెరగ్గా.. ఇప్పుడు దానికి బ్రేక్ పడింది.