
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుదారులందరికీ ఎర్లీ బర్డ్ స్కీమ్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) ప్రాపర్టీ ట్యాక్స్పై 5% రాయితీ పొందవచ్చని తెలిపింది.

పౌరులు 30 ఏప్రిల్ 2026 లోపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం పన్ను చెల్లించవలసిందిగా కోరారు, ఆ తర్వాత రాయితీని పొందవచ్చు.

ఇక అదేవిధంగా, గత సంవత్సరాల బకాయిలను కూడా పూర్తిగా చెల్లించవలసిందిగా GHMC విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాతే రాయితీకి అర్హత పొందవచ్చని తెలిపింది.

ఎలా చెల్లించాలంటే? MyGHMC / MyCURE యాప్, మీ సేవా కేంద్రాల్లో, అధికారిక వెబ్సైట్, సిటిజన్ సర్వీస్ సెంటర్లు, డబ్బును చెల్లింపు చేయవచ్చు.

పౌరులు ముందుగానే ఈ పన్నులు చెల్లించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని GHMC విజ్ఞప్తి వెల్లడించింది. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ పన్నులు చెల్లిచండి.