
ఇల్లు అందంగా ఉండాలి అన్నా, ఇంటిలో సంపద పెరగాలి అన్నా, ఇంటిలో తప్పక ఉండాల్సిన మొక్క మనీ ప్లాంట్. ఇది ఇంట్లో ఉండటం చాలా శుభప్రదం, అందుకే చాలా మంది తమ ఇంటిలో అందమైన మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటారు. కానీ ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ మొక్క వేపుగా గుబురుగా పెరిగినప్పుడే ఈ ఇంటిలో సంపద పెరుగుతుంది.

కానీ ఈ మధ్య కాలంలో మనీ ప్లాంట్ మొక్క అంత వేపుగా పెరగడం లేదు. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు మనం మనీ ప్లాంట్ మొక్క వేపుగా, గుబురుగా పెరగాలి అంటే సింపుల్ చిట్కా పాటిస్తే సరిపోతుందంట. ఇంతకీ అది ఏమిటి అనుకుంటున్నారా?

ఒక చిన్న పౌడర్ చెట్టు వేరు మొదట్లో వేయడం వలన మనీ ప్లాంట్ మొక్క చాలా వేపుగా పెరుగుతుందంట. మనీ ప్లాంట్ వేపుగా, గుబురుగా పెరగాలి అంటే, దీని కోసం చిన్న పొడి మీరు ఇంటిలోనే తయారు చేసుకోవాలి. అది ఏమిటి అంటే. ఎర్ర మట్టి, కోకోపీట్, ఇసుక, వరి పొట్టు ఇవన్నీ తీసుకొని ఒక పౌడర్లా తయారు చేసుకోవాలి.

తర్వాత దీనిలో ఎప్సమ్ సాల్ట్ కూడా ఒక చెంచా యాడ్ చేసి, వారానికి ఒకసారి ఈ పొడిని మనీ ప్లాంట్ మొక్క చివరిలో వేయాలంట. దీని వలన మనీ ప్లాంట్ మొక్క వేపుగా పెరగడమే కాకుండా, గుబురుగా వస్తుంది. చాల మంది మనీ ప్లాంట్ మొక్క ఆకులు ఎక్కువగా పసుపు రంగులోకి మారిపోతుంటాయి. అయితే ఈ పొడిని చల్లడం వలన ఆకులు పసుపు రంగులోకి మారకుండా ఉంటాయంట.

అంతే కాకుండా బియ్యం కడిగిన నీళ్లు, వాడిన టీ పొడి, పసుపు నీరు స్ప్రే చేయడం వంటివి చేయడం వలన కూడా మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే తప్పకుండా ఈ చిట్కాలు పాటించాలి. ఎందుకంటే? ఎవరి ఇంటిలో అయితే మనీ ప్లాంట్ మొక్క ఆరోగ్యంగా, వేపుగా పెరుగుతుందో వారి ఇంటిలో సంపదకు కొదవే ఉండదంట.